NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పెనువిషాధం.. గోడకూలి 8 మంది భక్తులు మృతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పెనువిషాధం.. గోడకూలి 8 మంది భక్తులు మృతి
    సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పెనువిషాధం.. గోడకూలి 8 మంది భక్తులు మృతి

    Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పెనువిషాధం.. గోడకూలి 8 మంది భక్తులు మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 30, 2025
    08:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖ జిల్లా సింహాచలంలో జరుగుతున్న చందనోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

    నిజరూప దర్శనం కోసం భక్తులు తరలివచ్చిన సమయంలో జరిగిన ప్రమాదంలో గోడ కూలి 8 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు.

    ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.

    ఈ ప్రమాదం మంగళవారం అర్ధరాత్రి తర్వాత, సింహాచలంలో కురిసిన భారీ వర్షం అనంతరం చోటుచేసుకుంది.

    సింహగిరి బస్టాండ్ నుంచి పైవైపు వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ల కోసం వేచి ఉన్న క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలిపోయింది.

    ఈ ఘటన తెలియగానే ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, అధికార యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించాయి.

    వివరాలు 

     నిజరూపంలో దర్శనం ఇచ్చిన వరాహ లక్ష్మీ నరసింహస్వామి

    హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు.

    మృతుదేహలను విశాఖ కేజీహెచ్‌కు తరలించగా, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.

    సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామివారు భక్తులకు తన నిజరూపంలో దర్శనం ఇచ్చారు.

    స్వామివారి ఈ దర్శనం కోసం ముందుగానే వేలాది మంది భక్తులు సింహగిరి కి చేరుకుని వేచి ఉన్నారు.

    మంగళవారం వేకువజామున 1 గంటకు సుప్రభాత సేవలతో స్వామివారిని మేల్కొలిపారు.

    ఆపై, ఆయన దేహంపై లేపిన చందనాన్ని వెండి బొరిగెలతో ఎంతో నెమ్మదిగా వేరుచేశారు.

    అనంతరం స్వామివారి నిజరూపాన్ని భక్తులు దర్శించేలా ఏర్పాట్లు చేశారు.

    వివరాలు 

    ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు

    స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు.

    వారు స్వామివారికి మొదటి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు.

    ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సందర్శనకోసం ఆలయం ప్రత్యేక ఏర్పాట్లతో సందడిగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్
    Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు కన్నప్ప
    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్
    DGCA: విమాన టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విండో షేడ్స్ మూసేయండి.. డీజీసీఏ కీలక ఆదేశాలు భారతదేశం

    విశాఖపట్టణం

    Visakhapatnam: చల్లటి మంచు ఆస్వాదించాలనుకుంటే.. అద్భుతమైన వంజంగి కొండలు చూడాల్సిందే..  పర్యాటకం
    Visakha Metro Rail: విశాఖ 'మెట్రో' మొదటి దశ డీపీఆర్‌కు ప్రభుత్వ ఆమోదం మెట్రో రైలు
     Vizag: విశాఖ విమానాశ్రయంలో మంచు ప్రభావం.. విమానాల దారి మళ్లింపు విమానం
    Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు నౌకాదళం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025