NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ప్రయాణికులకు హెచ్చరిక.. రేపటి నుంచి టెర్మినల్‌ 2 మూసివేత!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi: ప్రయాణికులకు హెచ్చరిక.. రేపటి నుంచి టెర్మినల్‌ 2 మూసివేత!
    ప్రయాణికులకు హెచ్చరిక.. రేపటి నుంచి టెర్మినల్‌ 2 మూసివేత!

    Delhi: ప్రయాణికులకు హెచ్చరిక.. రేపటి నుంచి టెర్మినల్‌ 2 మూసివేత!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 14, 2025
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌ 2ను మంగళవారం (ఏప్రిల్‌ 16) నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

    దీనిపై ప్రయాణికులను ముందుగానే అప్రమత్తం చేశారు. కొత్తగా ఆధునిక సౌకర్యాలతో టెర్మినల్‌ 2ను పునర్నిర్మించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

    2006లో నిర్మించిన టెర్మినల్‌ 2ను పూర్తిగా ఆధునికీకరించి, అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా మలచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

    సరికొత్త హంగులతో టెర్మినల్‌ 2 మరింత విస్తృతంగా రూపుదిద్దుకోనుంది.

    Details

    ఇండిగో విమానాల మార్పు

    ప్రస్తుతం టెర్మినల్‌ 2 నుంచి రాకపోకలు సాగిస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 122 విమానాలన్నీ టెర్మినల్‌ 1కి తరలిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

    మంగళవారం నుంచి ఈ మార్పు అమలులోకి వస్తుందని పేర్కొంది.

    ప్రయాణికులు ఈ మార్పును గమనించి ముందుగానే టెర్మినల్‌ వివరాలను తెలుసుకోవాలని సంస్థ సూచించింది.

    Details

    టెర్మినల్‌ 1, 3 నుంచే రాకపోకలు 

    విమానాశ్రయం మూల్యాంకనాల్లో ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు ప్రపంచంలోని అత్యధిక రద్దీ గల టాప్ 10 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది.

    ఈ విస్తృత రద్దీకి అనుగుణంగా టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం టెర్మినల్‌ 1, 3 నుంచే అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలు కొనసాగనున్నాయి.

    ఈ మార్పుల గురించి ప్రయాణికులకు ముందుగానే విమాన సంస్థలు మెసేజ్‌లు పంపించి సమాచారం.

    అందించాయి. ఎవరైనా ప్రయాణికులు టెర్మినల్ మార్పుల విషయంలో సందేహాలు లేదా ఇబ్బందులు ఎదుర్కొంటే సంబంధిత ఎయిర్‌లైన్‌ సంస్థలను సంప్రదించవచ్చని సూచించారు.

    ఇది తాత్కాలిక అసౌకర్యమే అయినా, భవిష్యత్‌లో ప్రయాణికులకు మెరుగైన అనుభవం కల్పించేందుకు దోహదపడే ప్రణాళికల్లో ఇది భాగమని అధికారులు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్
    PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన నరేంద్ర మోదీ
    Sana Yousuf: పాకిస్థాన్‌లో దారుణం.. సోషల్ మీడియా స్టార్‌ను ఇంట్లోనే కాల్చి చంపారు సోషల్ మీడియా

    దిల్లీ

    Delhi Stampede: ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయాలపై తాత్కాలిక నిషేధం.. రైల్వేశాఖ కీలక ప్రకటన  ఇండియా
    Delhi CM: 50 మంది సినీ నటులు, పారిశ్రామికవేత్తలు,దౌత్యవేత్తలు..ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు  బీజేపీ
    Delhi Railway Station stampede: దిల్లీలో తొక్కిసలాట ఘటనపై కోర్టు ప్రశ్న.. అన్ని ఎక్కువ టికెట్లు ఎందుకు అమ్మారు..? భారతదేశం
    Delhi Cm: దిల్లీ నూతన సీఎం గా రేఖా గుప్తా ఎన్నిక.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025