NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత
    తదుపరి వార్తా కథనం
    మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత
    మధ్యాహ్న భోజనంలో పాము గుర్తింపు

    మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత

    వ్రాసిన వారు Stalin
    Jan 10, 2023
    02:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఈ క్రమంలో ఆ ఆహారం తిన్న 30 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మయూరేశ్వర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    పాఠశాల సిబ్బంది పిల్లల భోజనం కోసం సిద్ధం చేసిన పప్పు కంటైనర్లలోని ఒకదానిలో పాము కనిపించింది. ఇది గుర్తించిన వెంటనే సిబ్బంది పాఠశాల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కొద్ది సేపటికే ఆ ఆహారం తిన్న పిల్లలకు వాంతులు వచ్చాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం రాంపూర్‌హట్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

    పశ్చిమ బెంగాల్

    విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

    విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీఓ) దీపాంజన్ జానా నిర్ధారించారు. ఈ విషయాన్ని ప్రాథమిక పాఠశాలల జిల్లా ఇన్‌స్పెక్టర్‌కు తెలియజేసినట్లు వెల్లడించారు. బుధవారం ఆయన పాఠశాలను సందర్శిస్తారని జానా పేర్కొన్నారు.

    ఈ విషయం తెలుసుకున్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కూడా ఘెరావ్ చేశారు. అతని ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు.

    అయితే ఈ పాఠశాలలో ఇది మొదటి సారి కాదని చెబుతున్నారు తల్లిదండ్రులు. గతంలో కూడా మధ్యాహ్న భోజనంలో బల్లులు, ఎలుకలను చాలాసార్లు గుర్తించినట్లు వారు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా  పాకిస్థాన్
    Raj Nidimoru and Samantha: రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ క్లారిటీ! సమంత
    Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం జార్జియా
    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు తెలంగాణ

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025