NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత
    భారతదేశం

    మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత

    మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 10, 2023, 02:29 pm 0 నిమి చదవండి
    మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత
    మధ్యాహ్న భోజనంలో పాము గుర్తింపు

    పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఈ క్రమంలో ఆ ఆహారం తిన్న 30 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మయూరేశ్వర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల సిబ్బంది పిల్లల భోజనం కోసం సిద్ధం చేసిన పప్పు కంటైనర్లలోని ఒకదానిలో పాము కనిపించింది. ఇది గుర్తించిన వెంటనే సిబ్బంది పాఠశాల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కొద్ది సేపటికే ఆ ఆహారం తిన్న పిల్లలకు వాంతులు వచ్చాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం రాంపూర్‌హట్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

    విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

    విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీఓ) దీపాంజన్ జానా నిర్ధారించారు. ఈ విషయాన్ని ప్రాథమిక పాఠశాలల జిల్లా ఇన్‌స్పెక్టర్‌కు తెలియజేసినట్లు వెల్లడించారు. బుధవారం ఆయన పాఠశాలను సందర్శిస్తారని జానా పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కూడా ఘెరావ్ చేశారు. అతని ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. అయితే ఈ పాఠశాలలో ఇది మొదటి సారి కాదని చెబుతున్నారు తల్లిదండ్రులు. గతంలో కూడా మధ్యాహ్న భోజనంలో బల్లులు, ఎలుకలను చాలాసార్లు గుర్తించినట్లు వారు పేర్కొన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    జాతీయ చియాగింజల దినోత్సవం: చియాగింజలు జుట్టుకు చర్మానికి చేసే మేలు చర్మ సంరక్షణ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్
    భారత్‌పై వన్డే సిరీస్ నెగ్గాక.. వార్నర్ సెలబ్రేషన్స్.. తగ్గేదేలా ఆస్ట్రేలియా
    2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్ భారతదేశం

    పశ్చిమ బెంగాల్

    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు ట్విట్టర్
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G ఎయిర్ టెల్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023