NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్
    తదుపరి వార్తా కథనం
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

    వ్రాసిన వారు Stalin
    Mar 11, 2023
    04:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు ​​జారీ చేయడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. మహాఘ్‌బంధన్‌కు కట్టుబడి ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని బీజేపీపై విరుచుకుపడ్డారు.

    కుంభకోణం విచారణలో భాగంగా తేజస్వి యాదవ్‌ను సీబీఐ విచారణకు పిలిచినట్లు వార్తలు వచ్చినట్లు నితీష్ మీడియాతో మాట్లాడారు.

    ఇప్పటికే ఈ కేసులో లాలూ యాదవ్, రబ్రీ దేవిలను సీబీఐ విచారించింది. తేజస్వి యాదవ్‌తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్ ముగ్గురు కూతుళ్ల ఇళ్లలో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది.

    లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ డీ ఉద్యోగాలను భూములు తీసుకొని ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.

    నితీష్

    2017లో కూడా ఇలాగే జరిగింది: నితీశ్

    2017లో కూడా తేజస్వీ యాదవ్ కుటుంబంపై ఇది జరిగిందని, అప్పుడు తాము (జేడీయూ-ఆర్‌జేడీ) వేరు వేరుగా ఉన్నామని నితీష్ కుమార్ చెప్పారు. ఐదేళ్ల తర్వాత, అంటే జేడీయూ-ఆర్‌జేడీ కలిశాక మళ్లీ ఏజెన్సీల దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంలో ఇంతకన్నా, తాను ఏం చెప్పగలనని నితీష్ పేర్కొన్నారు.

    కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు టెండర్లను రిగ్గింగ్ చేశారన్న ఆరోపణలపై లాలూ యాదవ్‌పై సీబీఐ దాడులు చేయడంతో 2017లో ఆర్జేడీతో జేడీ(యూ) పొత్తు వీగిపోయింది.

    ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్ కూడా సీబీఐ కేసులో తన పేరు రావడంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత జేడీయూ బీజేపీతో పొత్తు పెట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితీష్ కుమార్
    తేజస్వీ యాదవ్
    బిహార్
    సీబీఐ

    తాజా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్

    నితీష్ కుమార్

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్

    తేజస్వీ యాదవ్

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు సీబీఐ

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025