Page Loader
తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్
తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

వ్రాసిన వారు Stalin
Mar 11, 2023
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు ​​జారీ చేయడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. మహాఘ్‌బంధన్‌కు కట్టుబడి ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని బీజేపీపై విరుచుకుపడ్డారు. కుంభకోణం విచారణలో భాగంగా తేజస్వి యాదవ్‌ను సీబీఐ విచారణకు పిలిచినట్లు వార్తలు వచ్చినట్లు నితీష్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఈ కేసులో లాలూ యాదవ్, రబ్రీ దేవిలను సీబీఐ విచారించింది. తేజస్వి యాదవ్‌తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్ ముగ్గురు కూతుళ్ల ఇళ్లలో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ డీ ఉద్యోగాలను భూములు తీసుకొని ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.

నితీష్

2017లో కూడా ఇలాగే జరిగింది: నితీశ్

2017లో కూడా తేజస్వీ యాదవ్ కుటుంబంపై ఇది జరిగిందని, అప్పుడు తాము (జేడీయూ-ఆర్‌జేడీ) వేరు వేరుగా ఉన్నామని నితీష్ కుమార్ చెప్పారు. ఐదేళ్ల తర్వాత, అంటే జేడీయూ-ఆర్‌జేడీ కలిశాక మళ్లీ ఏజెన్సీల దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంలో ఇంతకన్నా, తాను ఏం చెప్పగలనని నితీష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు టెండర్లను రిగ్గింగ్ చేశారన్న ఆరోపణలపై లాలూ యాదవ్‌పై సీబీఐ దాడులు చేయడంతో 2017లో ఆర్జేడీతో జేడీ(యూ) పొత్తు వీగిపోయింది. ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్ కూడా సీబీఐ కేసులో తన పేరు రావడంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత జేడీయూ బీజేపీతో పొత్తు పెట్టుకుంది.