NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్
    భారతదేశం

    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 11, 2023, 04:48 pm 1 నిమి చదవండి
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు ​​జారీ చేయడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. మహాఘ్‌బంధన్‌కు కట్టుబడి ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని బీజేపీపై విరుచుకుపడ్డారు. కుంభకోణం విచారణలో భాగంగా తేజస్వి యాదవ్‌ను సీబీఐ విచారణకు పిలిచినట్లు వార్తలు వచ్చినట్లు నితీష్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఈ కేసులో లాలూ యాదవ్, రబ్రీ దేవిలను సీబీఐ విచారించింది. తేజస్వి యాదవ్‌తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్ ముగ్గురు కూతుళ్ల ఇళ్లలో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ డీ ఉద్యోగాలను భూములు తీసుకొని ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.

    2017లో కూడా ఇలాగే జరిగింది: నితీశ్

    2017లో కూడా తేజస్వీ యాదవ్ కుటుంబంపై ఇది జరిగిందని, అప్పుడు తాము (జేడీయూ-ఆర్‌జేడీ) వేరు వేరుగా ఉన్నామని నితీష్ కుమార్ చెప్పారు. ఐదేళ్ల తర్వాత, అంటే జేడీయూ-ఆర్‌జేడీ కలిశాక మళ్లీ ఏజెన్సీల దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంలో ఇంతకన్నా, తాను ఏం చెప్పగలనని నితీష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు టెండర్లను రిగ్గింగ్ చేశారన్న ఆరోపణలపై లాలూ యాదవ్‌పై సీబీఐ దాడులు చేయడంతో 2017లో ఆర్జేడీతో జేడీ(యూ) పొత్తు వీగిపోయింది. ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్ కూడా సీబీఐ కేసులో తన పేరు రావడంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత జేడీయూ బీజేపీతో పొత్తు పెట్టుకుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    బిహార్
    నితీష్ కుమార్
    తేజస్వీ యాదవ్
    సీబీఐ

    బిహార్

    బిహార్‌: ప్రశాంత్ కిషోర్‌కు గాయం; 'జన్ సూరాజ్' పాదయాత్రకు విరామం  ఇండియా లేటెస్ట్ న్యూస్
    దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు  దిల్లీ
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  ఆంధ్రప్రదేశ్
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?  తాజా వార్తలు

    నితీష్ కుమార్

    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్

    తేజస్వీ యాదవ్

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు మరోసారి సమన్లు జారీ చేసిన సీబీఐ సీబీఐ
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ లాలూ ప్రసాద్ యాదవ్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు లాలూ ప్రసాద్ యాదవ్

    సీబీఐ

    సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ సుప్రీంకోర్టు
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! కర్నూలు
    మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం వైఎస్సార్ కడప
    సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం  కర్ణాటక

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023