NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం
    భారతదేశం

    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 07, 2023, 02:09 pm 0 నిమి చదవండి
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

    ఉద్యోగాల కుంభకోణం కేసులో సోమవారం రబ్రీ దేవిని విచారించిన సీబీఐ అధికారులు, మంగళవారం బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం దిల్లీలోని మిసా భారతికి చేరుకున్న సీబీఐ అధికారులు ఇద్దరిని విచారించారు. 2004నుంచి 2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో బిహార్‌లో గ్రూప్ డీ ఉద్యోగాలను డబ్బులు తీసుకొని లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అక్రమంగా వచ్చిన డబ్బుతో యాదవ్ భూములను కొన్నారని అభియోగాలు మోపింది. ఆ భూములను వారి అనుచరుల పేరు మీద మళ్లించినట్లు సీబీఐ చెబుతోంది. అనారోగ్యంతో ఉన్న ఆర్జేడీ అధినేతను విచారణ పేరుతో వేధించడంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి.

    కూతురు ఇంట్లోనే ఉంటున్న లాలూ

    దిల్లీలోని పండారా పార్క్‌లోని మిషా భారతి నివాసానికి ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఐదుగురు సీబీఐ అధికారుల బృందం వచ్చారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్‌ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 2022న, లాలూ ప్రసాద్ యాదవ్, అతని భార్య రబ్రీ దేవి సహా 16మంది నిందితులపై నేరపూరిత కుట్ర, అవినీతి నేరాలకు సంబంధించిన కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. లాలూ ప్రసాద్‌తో పాటు మరికొందరిపై జరిగిన ప్రాథమిక విచారణ ఫలితాల మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. మొత్తం 16మంది నిందితులకు మార్చి 15న సమన్లు ​​జారీ చేసింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    బిహార్
    లాలూ ప్రసాద్ యాదవ్
    దిల్లీ
    సీబీఐ

    బిహార్

    బిహార్‌: ప్రశాంత్ కిషోర్‌కు గాయం; 'జన్ సూరాజ్' పాదయాత్రకు విరామం  ఇండియా లేటెస్ట్ న్యూస్
    దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు  దిల్లీ
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  ఆంధ్రప్రదేశ్
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?  తాజా వార్తలు

    లాలూ ప్రసాద్ యాదవ్

    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ సీబీఐ
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు తేజస్వీ యాదవ్
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు రాష్ట్రీయ జనతా దళ్/ఆర్జేడీ

    దిల్లీ

    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  హత్య
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  నరేంద్ర మోదీ
    దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్  భారతదేశం
    కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు  రెజ్లింగ్

    సీబీఐ

    సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ సుప్రీంకోర్టు
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! కర్నూలు
    మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం వైఎస్సార్ కడప
    సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం  కర్ణాటక

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023