NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు
    తదుపరి వార్తా కథనం
    జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు
    జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు

    జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు

    వ్రాసిన వారు Stalin
    Mar 06, 2023
    03:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం పాట్నాలోని తన నివాసంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ప్రశ్నించారు.

    ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)లో ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు రబ్రీదేవిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

    2004- 2009 లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాలను డబ్బు తీసుకొని ఇప్పించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ డబ్బుతో లాలూ భూములను కొనుగోలు చేసినట్లు సీబీఐ అభియోగాలు మోపింది.

    రబ్రీ దేవిని తదుపరి విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి అధికారులు పిలిపించే అవకాశం ఉంది.

    బిహార్

    మార్చి 15న కోర్టుకు హాజరుకావాలని ఆదేశం

    సీబీఐ దాడులు జరుగుతున్న నేపథ్యంలో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా రబ్రీ దేవి నివాసానికి చేరుకున్నారు.

    ఉద్యోగాల కోసం భూ కుంభకోణంలో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, మరో 14 మందికి ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 27న సమన్లు ​​జారీ చేసింది.

    నిందితులను మార్చి 15న కోర్టుకు హాజరుకావాలని ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్‌ ఆదేశించారు.

    ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఒకరిని మినహాయిస్తే నిందితులకు సంబంధించి అరెస్టు చేయకుండానే చార్జిషీటు దాఖలు చేసినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సీబీఐ
    బిహార్

    తాజా

    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు నితీష్ కుమార్
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025