NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం?
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం?
    తెలంగాణలో టీడీపీ పుంజుకుంటే ఏ పార్టీకి నష్టం?

    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం?

    వ్రాసిన వారు Stalin
    Dec 24, 2022
    09:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వ్యూహాత్మకంగా ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించి.. తెలంగాణలో చాలా కాలంగా యాక్టివ్‌గా లేని టీడీపీని చంద్రబాబు తిరిగి చర్చలోకి తీసుకోచ్చారు. టీడీపీ యాక్టివ్ అయితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

    తెలంగాణలో టీడీపీ ఏమాత్రం పుంజుకున్నా.. అది బీఆర్ఎస్‌కే మైనస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఏపీపై దృష్టిపెట్టాక.. టీడీపీ కేడర్ గణనీయంగా బీఆర్ఎస్ వైపు మళ్లింది. తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయితే.. ఆ కేడర్‌లో కొంతైనా తిరిగి సొంత గూటికి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    చంద్రబాబు

    కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడానికేనా ?

    చంద్రబాబు ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఉనికిని చాటాలనుకోవడానికి కారణాలు లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబును ఓడించడానికి జగన్‌కు కేసీఆర్ మద్దతుగా పనిచేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనడిచింది. జగన్‌ను గెలిపించేందుకు తలసానిని ఏపీకి పంపి.. అక్కడి యాదవులను గంపగుత్తగా వైసీపీ వైపు మళ్లించేలా, హైదరాబాద్‌లోని ఆంధ్రా వ్యాపారులను జగన్‌కు మద్దతుగా నిలిచేలా కేసీఆర్ చేసినట్లు ప్రచారం జరిగింది.

    కేసీఆర్ చేసిన పనికి ప్రతీకారంగా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గద్దెదించాలని చంద్రబాబు ప్రతినబూనారట. అందుకే తెలంగాణలో బలపడి.. ఇక్కడ అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి మద్దతుగా నిలవాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారట. తద్వారా బీజేపీకి దగ్గరవ్వాలనుకుంటున్న తన లక్ష్యాన్ని కూడా చేరుకునేలా వ్యూహాత్మకంగా చంద్రబాబు ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    తెలంగాణ

    గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే.. భారతదేశం

    చంద్రబాబు నాయుడు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు భారతదేశం
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ భారతదేశం
    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025