NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ 
    తదుపరి వార్తా కథనం
    Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ 
    Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ

    Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ 

    వ్రాసిన వారు Stalin
    Feb 28, 2024
    05:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

    జులైలో వీరి వివాహం జరగనుండగా.. మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    ఇంట్లో చివరి పెళ్లి కావడంతోఈ వేడుకలను అంబానీ ఫ్యామిలీ చాలా గ్రాండ్‍‌గా సెలబ్రేట్ చేస్తోంది.

    అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు గురించి దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది.

    ప్రపంచవ్యాప్తంగా అతిథులు వస్తున్న ఈ వేడుకలను అంబానీ ఫ్యామిలీ జామ్‌నగర్‌లో ఎందుకు నిర్వహిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవతోంది.

    అయితే ఈ అంశంపై స్వయంగా అనంత్ అంబానీ క్లారిటీ ఇచ్చారు.

    రిలయన్స్

    మా నాన్నమ్మ జామ్ నగర్‌లో పుట్టారు, ఇది నా ఊరు: అనంత్ అంబానీ 

    అనంత్ అంబానీ బుధవారం ఇండియా టుడేతో మాట్లాడారు.

    ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలను గుజరాత్‌లోని జామ్‌నగర్ అనే చిన్న గ్రామంలో ఎందుకు నిర్వహిస్తున్నారో వివరించారు.

    ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'వెడ్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో తాన పూర్వీకుల గ్రామమైన జామ్‌నగర్‌లో వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

    తనన నాన్నమ్మ జామ్ నగర్‌లో పుట్టారని, తాత ధీరూభాయ్ అంబానీ, తండ్రి ముఖేష్ అంబానీ ఇక్కడి నుంచే వ్యాపారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

    తాను కూడా కొంతకాలం ఇక్కడే పెరిగానని వెల్లడించారు. జామ్ నగర్‌లో తన వివాహ వేడుకను ప్లాన్ చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అనంత్ అంబానీ అన్నారు.

    అనంత్

    ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో 2500 రకాల వంటకాలు

    అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకకు దాదాపు 1000 మంది విశిష్ట అతిథులు హాజరుకానున్నారు.

    3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో అతిథులకు 2500 రకాల వంటకాలు వడ్డిస్తారు.

    ఇండోర్ నుంచి దాదాపు 25 మంది చెఫ్‌లతో కూడిన ప్రత్యేక బృందాన్ని జామ్‌నగర్‌కు రప్పిస్తున్నారు.

    బ్రేక్ ఫాస్ట్ మెనూలో 70 వెరైటీలు, భోజనంలో 250, రాత్రి భోజనంలో 250 రకాల ఆహార పదార్థాలను అతిథులకు అందించనున్నారు.

    ఒకసారి వడ్డించిన వంటకాన్ని మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తులు తీసుకుంటున్నారు.

    అతిథుల నుంచి ప్రత్యేకంగా ఆర్డర్స్ తీసుకొని ఈ వంటలను సిద్ధం చేస్తుండం గమనార్హం.

    ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. సినీ, రాజకీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అనంత్ అంబానీ
    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
    ముకేష్ అంబానీ
    తాజా వార్తలు

    తాజా

    Nirav Modi: యూకే హైకోర్టులో నీర‌వ్ మోదీకి షాక్‌.. బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌ యునైటెడ్ కింగ్డమ్
    Saraswati Pushkaralu: కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు: రేవంత్ రెడ్డి  తెలంగాణ
    S Jaishankar: చరిత్రలో మొదటిసారి.. తాలిబన్‌ విదేశాంగ మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు  భారతదేశం
    Andhra News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా.. మార్గదర్శకాలు విడుదల ఆంధ్రప్రదేశ్

    అనంత్ అంబానీ

    Gautam Singhania: 'అంబానీనే కాపాడారు'.. గౌతమ్ సింఘానియా భార్య సంచలన ఆరోపణలు వ్యాపారం

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

    Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ  తాజా వార్తలు
    రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా; డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ నియామకం  తాజా వార్తలు
    Mukesh Ambani: రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం: ముకేశ్ అంబానీకి బెదిరింపు  ముకేష్ అంబానీ
    Mukesh Ambani: ముకేష్ అంబానీకి మరో బెదిరింపు.. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ మెయిల్  ముకేష్ అంబానీ

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ విశాఖపట్టణం

    తాజా వార్తలు

    Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు బ్రిటన్
    Hardik Pandya: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా  హర్థిక్ పాండ్యా
    IND vs ENG test: రాంచీ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం  టీమిండియా
    PM Modi: రూ.41,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025