NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
    తదుపరి వార్తా కథనం
    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
    ప్రధాని మోదీకి కేసీఆర్ స్వాగతం పలుకుతారా?

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?

    వ్రాసిన వారు Stalin
    Jan 10, 2023
    01:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈ‌నెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

    2022లో ప్రధాని మోదీ 5సార్లు హైదరాబాద్‌కు వచ్చారు. మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా స్వాగతం పలకడానికి కేసీఆర్ వెళ్లకుండా.. మంత్రి తలసాని వంటి సీనియర్లను పంపారు. తద్వారా బీజేపీ పట్ల వ్యతిరేకతను చెప్పకనే చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

    హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణ, సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌, కాజీపేట రైల్వే కోచ్‌ వర్క్‌షాప్‌ పనులతో పాటు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

    మోదీ

    పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ

    రాష్ట్రంలో గవర్నర్-ప్రభుత్వం మధ్య సరైన సఖ్యత లేదు. ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చాలా రోజులుగా గవర్నర్‌ను అవాయిడ్ చేసిన కేసీఆర్.. ఇటీవల రాష్ట్రపతి ముర్ము ఏర్పాటు చేసిన విందు సందర్భంగా ఆమెను కలవాల్సి వచ్చింది.

    ఇప్పుడు ప్రధాని వస్తున్నది అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం కాబట్టి.. స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఈవెంట్‌కు హాజరు కాకపోతే.. అభివృద్ధి కార్యక్రమాల క్రెడిట్ అంతా.. బీజేపీకే పోతుందనే ఆలోచనతోనైనా ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

    ప్రధాని పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను బండి సంజయ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ
    తెలంగాణ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ
    పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు

    తెలంగాణ

    గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే.. భారతదేశం
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025