NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
    భారతదేశం

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 10, 2023, 01:49 pm 1 నిమి చదవండి
    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
    ప్రధాని మోదీకి కేసీఆర్ స్వాగతం పలుకుతారా?

    దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈ‌నెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. 2022లో ప్రధాని మోదీ 5సార్లు హైదరాబాద్‌కు వచ్చారు. మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా స్వాగతం పలకడానికి కేసీఆర్ వెళ్లకుండా.. మంత్రి తలసాని వంటి సీనియర్లను పంపారు. తద్వారా బీజేపీ పట్ల వ్యతిరేకతను చెప్పకనే చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణ, సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌, కాజీపేట రైల్వే కోచ్‌ వర్క్‌షాప్‌ పనులతో పాటు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

    పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ

    రాష్ట్రంలో గవర్నర్-ప్రభుత్వం మధ్య సరైన సఖ్యత లేదు. ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చాలా రోజులుగా గవర్నర్‌ను అవాయిడ్ చేసిన కేసీఆర్.. ఇటీవల రాష్ట్రపతి ముర్ము ఏర్పాటు చేసిన విందు సందర్భంగా ఆమెను కలవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రధాని వస్తున్నది అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం కాబట్టి.. స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఈవెంట్‌కు హాజరు కాకపోతే.. అభివృద్ధి కార్యక్రమాల క్రెడిట్ అంతా.. బీజేపీకే పోతుందనే ఆలోచనతోనైనా ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను బండి సంజయ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    మార్చి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    అమరవీరుల దినోత్సవం 2023: సంవత్సరంలో రెండుసార్లు జరుపుకునే దీని ప్రత్యేకత మీకు తెలుసా? ముఖ్యమైన తేదీలు
    వన్డేల్లో 65 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ విరాట్ కోహ్లీ
    విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన విశాఖపట్టణం

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం! తెలంగాణ
    మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్ తెలంగాణ
    సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ తెలంగాణ

    తెలంగాణ

    ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి హైదరాబాద్
    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తిరుమల తిరుపతి
    గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    నరేంద్ర మోదీ

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష ప్రధాన మంత్రి
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్

    ప్రధాన మంత్రి

    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక
    వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023