LOADING...
ArcelorMittal Steel Plant: నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు మార్చి 7న శంకుస్థాపన
నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు మార్చి 7న శంకుస్థాపన

ArcelorMittal Steel Plant: నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు మార్చి 7న శంకుస్థాపన

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన కీలక కార్యక్రమం మార్చి 7న అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద నిర్వహించనున్నట్లు ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్‌ఎస్‌) యాజమాన్యం 'ఎక్స్' వేదికగా అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రాజెక్టు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇది సంతోషకరమైన పరిణామమని కంపెనీ పేర్కొంది. సంబంధిత ప్రాంతం చిత్రం, గూగుల్ మ్యాప్ వివరాలు, ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారం పోస్టుతో పాటు షేర్ చేసింది. అయితే శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు.

వివరాలు 

విస్తృత ఏర్పాట్లు

ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,కేంద్ర,రాష్ట్ర మంత్రులు హాజరయ్యే అవకాశముందన్న సమాచారం రావడంతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. నక్కపల్లి మండలంలో పరిశ్రమ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్,ఐజీ గోపినాథ్ జెట్టి,ఎస్పీ తుహిన్ సిన్హా తదితర ఉన్నతాధికారులు బుధవారం పరిశీలించారు. ముఖ్యంగా భద్రతా చర్యలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

వివరాలు 

రూ.1.35 లక్షల కోట్ల వ్యయంతో రెండు దశల్లో ఈ మెగా స్టీల్ ప్రాజెక్టు

సుమారు రూ.1.35 లక్షల కోట్ల వ్యయంతో రెండు దశల్లో ఈ మెగా స్టీల్ ప్రాజెక్టును స్థాపించనున్నారు. ఏడాదిన్నర కాలంలోనే ఈ ప్రాజెక్టు అమలులోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో వేలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టించబడనున్నాయి. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏఎంఎన్‌ఎస్‌ భారీ అడుగు… అనకాపల్లిలో ఉక్కు పరిశ్రమ ప్రారంభం

Advertisement