NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / RSS chief :ఇవాళ మోహన్ భగవత్‌తో సమావేశం కానున్న యోగి ఆదిత్యనాథ్ 
    తదుపరి వార్తా కథనం
    RSS chief :ఇవాళ మోహన్ భగవత్‌తో సమావేశం కానున్న యోగి ఆదిత్యనాథ్ 
    RSS chief :ఇవాళ మోహన్ భగవత్‌తో సమావేశం కానున్న యోగి ఆదిత్యనాథ్

    RSS chief :ఇవాళ మోహన్ భగవత్‌తో సమావేశం కానున్న యోగి ఆదిత్యనాథ్ 

    వ్రాసిన వారు Stalin
    Jun 15, 2024
    06:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్రం గోరఖ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్‌తో సమావేశం కానున్నారు.

    లోక్‌సభ ఎన్నికల తర్వాత తన మొదటి ప్రకటనలో నిజమైన "సేవక్" అహంకారి కాదని, ప్రజలకు గౌరవప్రదంగా సేవ చేస్తాడని భగవత్ పేర్కొన్న కొద్ది రోజుల తర్వాత ఈ సమావేశం "మర్యాదపూర్వక సమావేశం"గా జరగనుంది.

    ఆయన ఈ వ్యాఖ్యలను పరోక్షంగా బిజెపిపై చేశారని రాజకీయవర్గాల్లో చర్చజరుగుతోంది.

    బీజేపీతో తమకు విభేదాలు వ‌చ్చాయ‌నే ప్రచారాన్ని ఆరెస్సెస్ కొట్టిపారేసింది భగవత్ వ్యాఖ్యలను అనుసరించి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

    అయితే ఆయన తన వ్యాఖ్యలను శుక్రవారం ఉపసంహరించుకున్నారు.

    చీలిక పుకార్లు 

    ఆగస్టు 31 నుండి వార్షిక సమన్వయ సమావేశాలు 

    ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలు నిర్వహించాలని, ఊహాగానాలను కొట్టిపారేసింది రెండు సంస్థల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, గందరగోళాన్ని సృష్టించేందుకు ఉద్దేశించిన ఊహాగానాలు మాత్రమేనని,తేల్చి చెప్పింది.

    చీలికకు సంబంధించిన ఏవైనా వార్తలను కొట్టిపారేయాలని ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు నొక్కిచెప్పాయి.

    "ఆయన 'అహంకార' వ్యాఖ్య ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీని, ఏ బిజెపి నాయకుడిని ఉద్దేశించి చేయలేదు" అని వర్గాలు తెలిపాయి.

    బిజెపితో సహా దాని అనుబంధ సంస్థలతో తమ సంస్థ వార్షిక సమన్వయ సమావేశం త్వరలో నిర్వహించనున్నామని ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది.

    మూడు రోజుల వార్షిక సమన్వయ సమావేశం ఆగస్టు 31 నుండి కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.

    ఎన్నికల ఫలితాలు 

    2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పనితీరు 

    2024 లోక్‌సభ ఎన్నికలలో, బిజెపి తన ప్రతిష్టాత్మక లక్ష్యం 370 సీట్లకు దూరమైంది. కేవలం 240 సీట్లు మాత్రమే సాధించింది.

    సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైనందున, ఆ పార్టీ వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 'కింగ్‌మేకర్లు' నితీష్ కుమార్ , ఎన్ చంద్రబాబు నాయుడులపై ఆధారపడవలసి వచ్చింది.

    ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 స్థానాలకు గాను 33 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుపొందింది.

    ఇది గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. ఈ నేపధ్యంలో యోగి ఆదిత్యనాధ్ , భగవత్ తో జరగబోయే సమావేశం ప్రాధాన్యత సంతరించకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యోగి ఆదిత్యనాథ్

    తాజా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్

    యోగి ఆదిత్యనాథ్

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మహారాష్ట్ర
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ బీజేపీ
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025