NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YSRCP : వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు.. వంశీకృష్ణ, రాంబాబు తర్వాత పార్థసారథి
    తదుపరి వార్తా కథనం
    YSRCP : వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు.. వంశీకృష్ణ, రాంబాబు తర్వాత పార్థసారథి
    వంశీకృష్ణ, రాంబాబు తర్వాత పార్థసారథి

    YSRCP : వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు.. వంశీకృష్ణ, రాంబాబు తర్వాత పార్థసారథి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 29, 2023
    10:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ మేరకు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల్లో అధిష్టానం మార్పులు చేర్పులకు యోచిస్తోంది.

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్‌ కొంత మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    ఇంకా కొందరికైతే అసలు టిక్కెట్ ఇవ్వట్లేదు. మరికొందరు ఎమ్మెల్యేలను ఈసారి ఎంపీ స్థానానికి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు.

    ఈ మార్పులు చేర్పులతో అసంతృప్త నేతలు నిరసన గళం విప్పుతున్నారు. ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు.

    ఇటీవలే జనసేనలోకి జంప్‌ అయిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇటువంటి ఆరోపణలే చేయగా, తర్వాత అన్నా రాంబాబాబు, ఇప్పుడు ఎమ్మెల్యే పార్థసారథి వంతు వచ్చింది.వీరంతా వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

    details

    సీఎం జగన్ మాత్రం గుర్తించలేేదు : పార్థసారథి

    ఎమ్మెల్యే పార్థసారథి సీఎం జగన్‌పైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ప్రజలు గుర్తించినా సీఎం జగన్‌ మాత్రం ఎప్పుడూ గుర్తించలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

    కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభ గురువారం రాత్రి నిర్వహించారు.

    సభకు మంత్రి జోగి రమేష్‌ సహా ఎమ్మెల్యే పార్థసారథి కూడా హాజరయ్యారు. దురదృష్టవశాత్తు సీఎం జగన్‌ తనను గుర్తించకపోయినప్పటికీ, పెనమలూరు ప్రజలు తనను గుర్తించారన్నారు.

    ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు.

    తాను ఎక్కడ ఉన్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. దీంతో వేదికపై ఉన్నజోగి రమేష్‌ కోపంతో వేదిక దిగి వెళ్లిపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' తెలుగు సినిమా
    ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా ఆంధ్రప్రదేశ్
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025