Baba Vanga : 2027లో కొందరికి సూపర్హ్యూమన్ శక్తులు.. బాబా వంగా వింత జోస్యం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా జోస్యాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. 2027కు సంబంధించి ఆమె అనుచరులు చెబుతున్న ఓ అంచనా ఇప్పుడు వైరల్గా మారింది. 2027లో ఓ మిస్టరీ వ్యాధి లేదా జన్యు ప్రయోగం కారణంగా కొందరు మనుషులు సూపర్హ్యూమన్ల తరహా శక్తులు పొందుతారని చెప్పారు. ఈ జోస్యం అచ్చం సైన్స్ ఫిక్షన్ కథను తలపిస్తోంది. అయితే ఈ శక్తులు ఎలా వస్తాయి? ఎలాంటి శక్తులు కలుగుతాయి? ఎంతమందికి వస్తాయి? అనే విషయాలపై మాత్రం ఎలాంటి వివరాలు లేవు. బహుశా వ్యాధి లేదా ప్రయోగం వల్ల చాలామంది ప్రభావితమైనా, వారిలో కొందరికి మాత్రమే ఈ ప్రత్యేక శక్తులు వస్తాయని బాబా వంగా అనుచరులు చెబుతున్నారు.
వివరాలు
2026పై బాబా వంగా అంచనాలివే
ఇది నిజంగా ఆమె చెప్పిన జోస్యమా?ఒకవేళ అయితే అది భవిష్యత్తులో నిజమవుతుందా? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
బల్గేరియాకు చెందిన అంధురాలైన బాబా వంగా భవిష్యత్తులో జరిగే ఘటనలను ముందే చెప్పేవారని.. గతంలో కరోనా మహమ్మారి,9/11 దాడులు,ప్రిన్సెస్ డయానా మరణం వంటి పలు ఘటనలను ముందే ఊహించారని ఆమె అనుచరులు చెబుతుంటారు.
అయితే ఆమె నిజంగా ఈ విషయాలను ముందుగానే చెప్పినట్లు నిర్ధారించే ఆధారాలు లేవు.
దశాబ్దాల క్రితమే ఆమె ఈ ఘటనలను ఊహించారని మాత్రం విశ్వాసులు నమ్ముతున్నారు.
2026కు సంబంధించి కూడా బాబావంగా పలు అంచనాలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
కొత్త ప్రపంచ యుద్ధం,వాతావరణ మార్పులతో ముడిపడిన భారీ ప్రకృతి విపత్తులు,సాంకేతిక పరిజ్ఞానం నుంచి ముప్పు,ఏలియన్ల రాక వంటివి ఇందులో ఉన్నాయి.
వివరాలు
పుతిన్ ఎదుగుదల
తూర్పు ప్రాంతంలో మొదలయ్యే ఓ యుద్ధం పశ్చిమ దేశాలకు విస్తరిస్తుందని ఆమె జోస్యం చెప్పినట్లు అనుచరులు చెబుతున్నారు.
ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ కూడా మూడో ప్రపంచ యుద్ధం గురించి అంచనా వేసినట్లు ప్రచారం ఉంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ నాయకుడిగా ఎదిగి, 'ప్రపంచానికి అధిపతి'గా మారతారని బాబా వంగా జోస్యంలో ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, పుతిన్ మరింత అధికారం చేపట్టే సూచనలు కనిపించడం లేదని ఈ అంచనాలపై కథనాలు పేర్కొంటున్నాయి.
వివరాలు
2026లో భూకంపాలు, వరదలు
2026లో ప్రకృతి విపత్తులు ప్రధానంగా నిలిచాయని బాబా వంగా జోస్యాలను ప్రచారం చేస్తున్న వారు చెబుతున్నారు.
వెనిజులా, కొలంబియా, జపాన్, ఇండోనేషియాల్లో భారీ భూకంపాలు సంభవించగా.. ఆగస్టులో నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
వివరాలు
ఏఐ, ఏలియన్ల రాక
కృత్రిమ మేధ (AI) కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలు ప్రభావితమయ్యాయి.
రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
మరోవైపు క్రీడా కార్యక్రమం సందర్భంగా ఏలియన్లు భూమిని సందర్శిస్తారన్న బాబా వంగా జోస్యం మాత్రం ఇంకా నిజం కాలేదు.
2026 నవంబరులో భారీ అంతరిక్ష నౌక భూమిని సందర్శిస్తుందని ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
దీంతో అది నిజమవుతుందా లేదా అన్నది తేలడానికి ఇంకా కొంత సమయం ఉంది. 2025లోనూ ఆమె ఇలాంటి అంచనానే చెప్పినట్లు అనుచరులు పేర్కొంటున్నారు.