NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Kailash Mansarovar Yatra: ఐదేళ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర..మార్గదర్శకాలు ఇవే..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kailash Mansarovar Yatra: ఐదేళ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర..మార్గదర్శకాలు ఇవే..
    ఐదేళ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర..మార్గదర్శకాలు ఇవే

    Kailash Mansarovar Yatra: ఐదేళ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర..మార్గదర్శకాలు ఇవే..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 02, 2025
    12:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కైలాస మానస సరోవర యాత్ర అనేది హిందూ మతంతో పాటు బౌద్ధ,జైన, బోన్ మతాల వారికీ పవిత్రమైన యాత్రగా చెప్పవచ్చు.

    ఇది అనేక మతాల భక్తులను ఆకర్షించే పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ యాత్ర ద్వారా యాత్రికులు టిబెట్ లోని కైలాస పర్వతం,మానస సరోవర సరస్సు వద్దకు చేరుకొని, ప్రకృతి దృశ్యాలతో కూడిన హిమాలయ పరిసరాలలో ఆధ్యాత్మికతను అనుభవిస్తారు.

    2017లో డోక్లాం సంఘటన కారణంగా,అలాగే COVID-19 మహమ్మారి కారణంగా ఈ యాత్ర ఐదు సంవత్సరాలపాటు నిలిపివేసారు.

    ఇప్పుడు 2025 జూన్ 30న సిక్కిం రాష్ట్రంలో తిరిగి ప్రారంభం కానుంది.

    ఈ యాత్ర సుమారు 22రోజులు సాగనుంది. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టాక్ లోని ఇండో-చైనా సరిహద్దు నుంచి యాత్రికులు ఈ పవిత్ర యాత్రను ప్రారంభిస్తారు.

    వివరాలు 

    రెండు కేంద్రాలు ఏర్పాటు

    యాత్రికులు మానస సరోవర సరస్సు, కైలాస పర్వతం వద్దకు చేరుకుని, ఆ పవిత్ర పర్వతం చుట్టూ పరిక్రమ (సర్కమ్) చేస్తారు.

    ఈ ప్రయాణంలో 16వ మైలు ప్రాంతంలో (సుమారు 10,000 అడుగులు ఎత్తులో) హంగు సరస్సు సమీపంలో (సుమారు 14,000 అడుగుల ఎత్తులో) రెండు కేంద్రాలు ఏర్పాటుచేస్తారు.

    ఈ కేంద్రాలు యాత్రికులకు వసతి, ఆరోగ్య సంరక్షణ, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలలో సౌకర్యాలు అవసరమైన సామగ్రి అందించడానికి సహాయపడతాయి,

    యాత్ర సజావుగా, భద్రతగా సాగేందుకు అధికారులు రోడ్డు నిర్వహణ, భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు.

    సిక్కిం లోని నాథులా మార్గం మంచి రోడ్లు, ప్రశాంతమైన పరిసరాలు కలిగి ఉండటంతో, అత్యంత సురక్షితమైన, సౌకర్యవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది.

    వివరాలు 

    వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా శారీరకంగా సిద్దం కావాలి

    ఈ యాత్రకు వెళ్లదలచిన వారు విదేశాంగ మంత్రిత్వ శాఖలో తప్పనిసరిగా నమోదు కావాలి.

    ఎత్తైన ప్రాంతాల వాతావరణం, వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా శారీరకంగా సిద్దం కావాలి.

    యాత్ర సమయంలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు, పర్మిట్లు, ఇతర అవసరమైన పత్రాలు తప్పకుండా తీసుకెళ్ళాలి.

    ఈ విధంగా ప్రభుత్వం ఈ పవిత్ర యాత్ర కోసం నిర్దేశించిన మార్గదర్శకాలు జారీ చేసి, యాత్రికుల భద్రత, సౌకర్యాలను కాపాడుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం

    తాజా

    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్
    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్

    పర్యాటకం

    Underground Cities: భూగర్భంలో దాగి ఉన్న వింత నగరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ? లైఫ్-స్టైల్
    Tourism : మన దేశంలో ఉన్నన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్లు.. మరే దేశంలోనూ లేవు లైఫ్-స్టైల్
    Railway: భారతదేశంలోని ఈ రైలుస్టేషన్ల నుండి విదేశాలకు ప్రయాణం చేయచ్చని.. మీకు తెలుసా? లైఫ్-స్టైల్
    VjaTo Srisailam: కృష్ణా నదిలో సీ ప్లేన్ సేవలు.. పర్యాటక రంగానికి కొత్త ఊపు.. డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025