Page Loader
Mahavir Jayanti: మహావీర్ జయంతి స్పెషల్.. ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సిన విషయాలివే!
మహావీర్ జయంతి స్పెషల్.. ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సిన విషయాలివే!

Mahavir Jayanti: మహావీర్ జయంతి స్పెషల్.. ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సిన విషయాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2025
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

గౌతమ బుద్ధుడు, మహావీరుడు ఈ ఇద్దరూ అహింస సిద్ధాంతాన్ని ప్రోత్సహించి, సమాజానికి మార్గదర్శకులయ్యారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతేడాది చైత్ర మాసంలో శుక్ల పక్ష త్రయోదశి నాడు మహావీర్ జయంతి జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది చైత్ర శుద్ధ చతుర్దశి అయిన ఏప్రిల్ 10న గురువారం ఈ మహోత్సవాన్ని నిర్వహించాలని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా మహావీరుని జీవితం, బోధనలు, ఐదు సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. మహావీర్ జయంతి ఏంటి? జైన మతంలోని 24వ తీర్థంకరుడైన మహావీరుని జయంతిని జైనులు అత్యంత పవిత్ర దినంగా భావిస్తారు. ఈ రోజున ఆయనకు గౌరవంగా జైనులు ఊరేగింపులు, ప్రభాత్‌ఫేరీలు నిర్వహిస్తారు. భక్తులు ఆయన బోధనలు స్మరిస్తారు.

Details

 మహావీరుని ఐదు ప్రధాన సూత్రాలు

మహావీరుడు మోక్షాన్ని పొందే మార్గంగా ఐదు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించాడు 1. అహింస - శరీరం, మాట, మనసుతో ఎవరినీ హింసించకూడదు. 2. సత్యం - ఎప్పుడూ నిజం మాట్లాడాలి. 3. అస్తేయం - ఇతరుల సమ్మతినిలా కాకుండా ఏదీ స్వీకరించకూడదు. 4. బ్రహ్మచర్యం - జీవన విధానంలో నియమాలు పాటిస్తూ పావనంగా ఉండాలి. 5. అపరిగ్రహం - అవసరమయ్యినంత మాత్రమే తీసుకొని మిగిలినది విడిచిపెట్టాలి. ఈ ఐదు సూత్రాలు మోక్ష మార్గంగా పేర్కొంటూ, మహావీర్ జయంతి రోజున జైనులు ఉపవాస దీక్షలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Details

 మహావీరుని జీవితం

వర్ధమానుడు పేరుతో బీహార్ రాష్ట్రంలోని రాజ కుటుంబంలో క్రీస్తుపూర్వం 599లో జన్మించిన మహావీరుడు, రాజు సిద్ధార్థుడు, రాణి త్రిశాల కుమారుడు. తన తండ్రి మరణించిన తర్వాత రాజ్యబాధ్యతలు స్వీకరించి, యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కానీ మహావీరుడికి భౌతిక జీవితం మీద ఆసక్తి తక్కువగా ఉండేది. తన ఉనికి, జీవిత గమ్యం గురించి తెలుసుకోవాలనే ఆతృతతో 36 ఏళ్ల వయసులో రాజ్యాన్ని, కుటుంబాన్ని వదిలిపెట్టి అడవిలో తపస్సు ప్రారంభించాడు. 12 సంవత్సరాల కఠిన తపస్సు తర్వాత మహావీరుడు జ్ఞానోదయాన్ని పొందాడు. ఆ తర్వాత మగధ దేశం సహా అనేక ప్రాంతాల్లో ధర్మాన్ని బోధించాడు.

Details

 ఆయన బోధించిన ముఖ్య సందేశాలు

తన్ను తానే జయించుకోవడం కోటి మందిని జయించడానికంటే గొప్పది. ప్రతి ఆత్మ ఆనందం, జ్ఞానం గలదే. ఆ ఆనందాన్ని బయట వెతకకూడదు. దైవత్వం మనలోనే ఉంది, దానిని మనమే సాధించాలి భయాన్ని జయించగలవారే నిజమైన శాంతిని పొందగలరు - అహింసా వాదమే నిజమైన ఆత్మ నియంత్రణ. మహావీరుని మరణం దేశమంతటా తిరుగుతూ తన ధర్మాన్ని బోధించిన మహావీరుడు తన 72వ ఏట పరమపదించారు. ఆయనకు ముందు 23 మంది తీర్థంకరులు ఉన్నా, జైన మతానికి మహావీరుని కాలంలోనే విస్తృత గుర్తింపు లభించింది. ఆయన 32 సంవత్సరాలపాటు అహింస, ధర్మ బోధన చేస్తూ జైన మతాన్ని నిలబెట్టాడు. అందుకే ప్రతి సంవత్సరం మహావీర జయంతిని ఒక పండుగలా జ్ఞాపకం చేసుకుంటారు.