LOADING...
Sleeper Bus catches fire: ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సులో మంటలు
ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సులో మంటలు

Sleeper Bus catches fire: ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సులో మంటలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4:45 గంటలకు రెవ్రి టోల్ ప్లాజా సమీపంలో దిల్లీ నుంచి లఖ్‌నవూ వెళ్తున్న ఏసీ బస్సులో చోటుచేసుకుంది. బస్సు టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తక్షణమే అప్రమత్తమైన డ్రైవర్ జగత్ సింగ్ ప్రయాణికులందరినీ కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Details

మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో ఉన్న 39 మంది ప్రయాణికుల్లో ఎవరూ గాయపడలేదు. డ్రైవర్ వివరాల ప్రకారం, మంటలు మొదట బస్సు చక్రంలో ప్రారంభం కాగా, ఆ తర్వాత వాహనంలోని ఇతర భాగాలకు వ్యాపించాయి. ప్రైవేటు బస్సు యాజమాన్యం వెంటనే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ బస్సులను ఏర్పాటు చేసింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటల కారణాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.