NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / కృష్ణాష్టమి సందర్భంగా భగవంతుడికి సమర్పించాల్సిన నైవేద్యములు, వాటిని తయారు చేసే విధానములు 
    తదుపరి వార్తా కథనం
    కృష్ణాష్టమి సందర్భంగా భగవంతుడికి సమర్పించాల్సిన నైవేద్యములు, వాటిని తయారు చేసే విధానములు 
    శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భగవంతుడికి సమర్పించాల్సిన నైవేద్యములు

    కృష్ణాష్టమి సందర్భంగా భగవంతుడికి సమర్పించాల్సిన నైవేద్యములు, వాటిని తయారు చేసే విధానములు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 06, 2023
    05:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రావణమాసంలో వచ్చే పండగ శ్రీకృష్ణ జన్మాష్టమి. తెలుగు వాళ్ళు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున కృష్ణ భగవానుడికి నైవేద్యాలు సమర్పిస్తారు.

    కొత్తబట్టలు ధరించి శ్రీకృష్ణ ఆలయాలకు వెళ్లి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని రకాల నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

    Details

    బెల్లం అటుకులు

    శ్రీకృష్ణుడికి అటుకులు చాలా ఇష్టమైన ఆహారం. అందుకే ఈరోజు అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు.

    లావుపాటి అటుకులను ఒక కప్పు తీసుకొని, వాటిని రెండు నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత నీటిని వడపోసి గంటసేపు అటుకులను పక్కన పెట్టాలి.

    ఇప్పుడు ఒక పాత్రలో నెయ్యి వేసి కాసేపు మరిగించాలి. ఆ తర్వాత దాంట్లో కాజు, యాలకుల పొడి, బెల్లం వేసి వేయించాలి.

    ఆ తర్వాత అటుకులను స్టవ్ మీద ఉన్న బెల్లం పాకంలో వేసి నెమ్మదిగా కలపాలి.

    అంతే బెల్లం అటుకులు నైవేద్యం తయారైపోయింది.

    Details

    కొబ్బరి లడ్డు 

    దీనికోసం 400 గ్రాముల పాలు, మూడు కప్పుల కొబ్బరి తురుము, అరకప్పు నెయ్యి కావాలి. ఒక పాత్రలో పాలు పోసి అందులో మూడు కప్పుల కొబ్బరి తురుము వేసి స్టవ్ మీద ఉంచాలి.

    తక్కువ మంటతో కాసేపు వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పాత్రలోని కొబ్బరి తురుము, పాలు కలిసి గడ్డ కట్టినట్టుగా మారుతాయి.

    ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని లడ్డూ లాగా తయారు చేయాలి. అంతే కొబ్బరి లడ్డు తయారైపోయింది.

    Details

    మినప సున్ని ఉండలు 

    ఒక కప్పు మినప గుండ్లను చిన్న పాత్రలో వేసి వేయించాలి. పది నిమిషాల తర్వాత మినప గుండ్లు బాగా వేగుతాయి. ఆ తర్వాత మినపగుండ్లను గ్రైండర్లో వేసి పిండి తయారు చేసుకోవాలి.

    ఈ పిండికి బెల్లం కూడా కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మినప గుండ్లు, బెల్లం కలపగా వచ్చిన పిండికి అరకప్పు నెయ్యిని కలిపి ఉండల మాదిరిగా తయారు చేసుకోవాలి. అంతే సున్నుండలు తయారైనట్టే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కృష్ణాష్టమి
    పండగ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కృష్ణాష్టమి

    తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులను అలరించిన హీరోలు వీళ్ళే  తెలుగు సినిమా

    పండగ

    క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి లైఫ్-స్టైల్
    పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి ప్రైమ్
    క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025