Sankranthi dishes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే
సంక్రాంతి పండగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనగానే అందరికీ పిండి వంటలు గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలో సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో చేసుకునే సంప్రదాయ పిండి వంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొంగల్ పాలు, బెల్లం, పప్పు, నెయ్యితో వండిన వంటకం ఇది. దీన్ని వెన్న, చట్నీతో వేడిగా వడ్డిస్తారు. పొంగల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి స్వీట్ పొంగల్ (చక్కర పొంగల్), రెండోది వెన్న పొంగల్. సకినాలు బియ్యం పిండి, నువ్వులు, తగినంత ఉప్పును కలిపి కరకరలాడే సకినాలను సంక్రాంతికి ప్రత్యేకంగా చేస్తారు. దీన్ని గుండ్రంగా చేస్తారు. సకినాలను తెలంగాణలో ఎక్కువగా చేస్తారు.
అరిసెలు
బియ్యం పిండి, బెల్లం, నెయ్యితో చేస్తారు. వీటిని బెల్లంతో పాకం పట్టడం ద్వారా తయారు చేస్తారు. ఇవి సంక్రాంతికి రెండు రాష్ట్రాల్లో కచ్చితంగా చేస్తారు. కొబ్బరి కజ్జికాయలు కొబ్బరి కజ్జికాయలు అనేవి ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేకత. తురిమిన కొబ్బరి, పంచదార మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. చెక్కలు: చెక్కలు అనేవి.. పండగలకు సంప్రదాయంగా చేసే చిరు తిండి వంటకం. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. బియ్యం పిండి, చన పప్పు (చిక్పీస్లు), కరివేపాకు, పచ్చి మిరపకాయలు, ఇంగువ వంటి మసాలా దినుసులతో తయారు చేస్తారు.