ట్రావెల్: ఇండియాలోని అత్యంత పరిశుభ్రమైన బీచ్ లను సందర్శించాలనుకుంటే ఇది తెలుసుకోండి
సముద్ర తీరాలను అందంగా పరిశుభ్రంగా ఉంచినందుకు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అందిస్తారు. అలా మనదేశంలో బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అందుకున్న బీచ్ లు 12 ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. కాసర్ కోడ్ బీచ్ - కర్ణాటక: చుట్టుపక్కల సరుగుడు చెట్లు, తెల్లని ఇసుకను పరుచుకుని ఈ తీరం అందంగా ఉంటుంది. 2020లో ఈ తీరానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది. సోలార్ పవర్ ప్లాంట్, గ్రే వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినందుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది. రాధానగర్ బీచ్ - అండమాన్ నికోబార్ ఈ తీరం చుట్టుపక్కల కొబ్బరి చెట్లు, అవి దాటితే అడవి ప్రాంతం ఉంటాయి. భారతదేశంలోని అత్యంత సుందరమైన బీచుల్లో ఇదొకటి.
బ్లూ ఫ్లాగ్ అందుకున్న తీర ప్రాంతాలు
గోల్డెన్ బీచ్ - ఒడిషా పూరీ బీచ్ అని కూడా పిలుచుకునే ఈ బీచ్, ఆసియాలోనే బ్లూ ఫ్లాగ్ అందుకున్న మొదటి బీచ్ గా రికార్డు సృష్టించింది. కోణార్క్ సూర్యదేవాలయానికి దగ్గర్లో ఉండే ఈ బీచ్ కు, 2020లో సర్టిఫికేట్ వచ్చింది. శివరాజ్ పూర్ బీచ్ - గుజరాత్ ద్వారకా నుండి 12కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంటుంది. ఈ తీరంలో బోటింగ్, స్కూబా డైవింగ్, డాల్ఫిన్లను చూడటం వంటివి చేయవచ్చు. గోగ్లా బీచ్ - డయ్యూ అరేబియా సముద్ర తీరమైన ఈ బీచ్, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. బంగారు వర్ణంలో ఉండే ఇసుక, నీలికాంతితో మెరిసే సముద్రపు నీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.