NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / కన్యాకుమారి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి
    తదుపరి వార్తా కథనం
    కన్యాకుమారి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి
    కన్యాకుమారిలో చూడాల్సిన ప్రదేశాలు

    కన్యాకుమారి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 23, 2023
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ట్రావెలింగ్ చేయాలన్న ఇష్టంతో తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఆ ప్రాంతంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడం మర్చిపోకండి.

    సముద్ర తీర ప్రాంతమైన కన్యాకుమారిలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

    కన్యాకుమారి గుడి:

    ఈ ప్రాంతంలోని చెప్పుకోదగిన ఆలయాల్లో కన్యాకుమారి ఆలయం ఒకటి. దీన్ని అమ్మా భగవతి ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని పాండ్యులు నిర్మించారని ఆ తర్వాత నాయకులు దీనికి మరమ్మత్తులు చేశారని చెబుతారు.

    ప్రపంచంలోని 108 శక్తి పీఠాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఉదయం 4:30నుండి మధ్యాహ్నం 12గంటల వరకు భక్తులకు ప్రవేశం ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30నుండి 8:00వరకు ఆలయం తలుపులు తెరిచి ఉంటాయి.

    Details

    ఆకట్టుకునే వివేకానంద రాతిద్వీపం 

    పద్మనాభపురం భవంతి:

    ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కలప భవంతిగా పేరొందిన పద్మనాభపురం భవంతి, ట్రావెన్కోర్ పాలకులకు నివాసంగా ఉండేదని చెబుతారు.

    ట్రావెన్కోర్ వంశానికి చెందిన ఇరవి వర్మ కులశేఖర పెరుమాళ్ అనే పాలకుడు 16వ శతాబ్దంలో ఈ భవంతిని నిర్మించారని చరిత్ర చెబుతోంది.

    వివేకానంద రాతిద్వీపం:

    కన్యాకుమారి వెళితే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో వివేకానంద రాతిద్వీపం కూడా ఒకటి. ఇది రాతితో కప్పబడి ఉన్న సముద్రంలోని ఒక చిన్న ద్వీపం.

    స్వామి వివేకానంద ఈ ద్వీపానికి చేరుకుని ధ్యానం చేసేవారని చెబుతారు. ఈ ప్రదేశంలో వివేకానంద మండపం, శ్రీపాద మండపం కనిపిస్తాయి.

    Details

    వివేకానంద రాతి ద్వీపం పక్కనే 133 అడుగుల విగ్రహం 

    తిరువళ్ళువార్ విగ్రహం

    స్వామి వివేకానంద రాతిద్వీపానికి పక్కనే 133అడుగుల తిరువళ్ళువార్ విగ్రహం ఉంటుంది. భారతదేశంలోని గొప్ప కవుల్లో తిరువళ్ళువార్ ఒకరు.

    2000 జనవరి 1వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారతదేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో ఈ విగ్రహం కూడా ఒకటి.

    రామ్సన్ చర్చ్:

    మేరీమాతకు చెందిన ఈ చర్చి, కన్యాకుమారి తీర ప్రాంతంలో ఉంటుంది. గోతిక్ శిల్పకలతో చూడడానికి అందంగా నిర్మించారు. ఈ చర్చిలో అత్యంత అసాధారణంగా కనిపించే విషయం ఏమిటంటే, చీరలో మేరీమాత విగ్రహం దర్శనమిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం
    తమిళనాడు

    తాజా

    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ
    Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా  పాకిస్థాన్
    Raj Nidimoru and Samantha: రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ క్లారిటీ! సమంత

    పర్యాటకం

    ట్రావెల్: ఫిన్ లాండ్ పర్యటనకు వెళ్తే గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు లైఫ్-స్టైల్
    ట్రావెల్: పోర్చుగల్ నుండి గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు లైఫ్-స్టైల్
    ట్రావెల్: చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్ళు పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్ వాన్ వెళ్లాల్సిందే లైఫ్-స్టైల్
    ట్రావెల్: ఆస్ట్రియాలో అవాయిడ్ చేయాల్సిన పొరపాట్లు లైఫ్-స్టైల్

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి గవర్నర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025