NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: యేల్‌ వర్సిటీ-సీ ఓటర్‌ సర్వేలో భారతీయుల వెల్లడి 
    తదుపరి వార్తా కథనం
    భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: యేల్‌ వర్సిటీ-సీ ఓటర్‌ సర్వేలో భారతీయుల వెల్లడి 
    భూమి మీద పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

    భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: యేల్‌ వర్సిటీ-సీ ఓటర్‌ సర్వేలో భారతీయుల వెల్లడి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 16, 2023
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాకు చెందిన యేల్ యూనివర్సిటీ, వాతవరణంలోని మార్పుల గురించి భారతీయుల అభిప్రాయాలు సేకరించింది.

    పెరుగుతున్న భూమి ఉష్ణోగ్రతలు- భారత ప్రజల అవగాహన అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, భారతీయులు తమ అభిప్రాయాలను ఈ విధంగా చెప్పుకొచ్చారు.

    వాతావరణంలో మార్పులు స్పష్టంగా ఏర్పడుతున్నాయని, భూమి మీద ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిందని, పెరిగిన వేడి కారణంగా జీవన విధానాలు ప్రభావితం అవుతున్నాయని అన్నారు.

    పర్యావరణంలో మార్పులు, మనుషులు చేసే పనుల వల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

    దాదాపు 82శాతం మంది ప్రజలు భూమి మీద ఉష్ణోగ్రత పెరిగిందని పేర్కొన్నారు. దాదపు 4169మంది భారతీయులపై టెలిఫోన్ ఆధారంగా ఈ సర్వే చేపట్టారు.

    Details

    అధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు ఎక్కువవుతున్నాయి 

    సాధారణంగా భూమి మీద అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ రోజుల సంఖ్య పెరిగిందని, దీన్ని బట్టి భూమి మీద వేడి పెరిగిందని అర్థమవుతోందని అన్నారు.

    భూమి మీద వేడి ఇలానే పెరిగితే వచ్చే 20సంవత్సరాల్లో భూమి మీద జీవించడం కష్టంగా మారుతుందని, అనేక వ్యాధులు సోకే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు.

    భూమి మీద వర్షాపాతం కూడా తగ్గిందని 44శాతం మంది అన్నారు. అలాగే వర్షాపాతం పెరిగిందని 34శాతం మంది అభిప్రాయ పడ్డారు.

    ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం పెరిగిందని, విపత్తుల నుండి బయటపడటానికి సమయం కూడా ఎక్కువగా అవుతోందని, ఈ కార్యక్రమం నిర్వహించిన సర్వేలో వెల్లడి చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    జీవనశైలి

    బృహస్పతి గ్రహ చంద్రుడిని అధ్యయనం చేసేందుకు ESA లాంచ్ చేసిన జ్యూస్ మిషన్ విశేషాలు  టెక్నాలజీ
    మీ శరీరానికి తొందరగా శక్తిని అందించే ఆహారాలు  ఆహారం
    R21: ప్రపంచాన్ని మార్చే శక్తిగా మారనున్న మలేరియా వ్యాక్సిన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  లైఫ్-స్టైల్
    అక్షయ తృతీయ 2023: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025