NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / 'క్లౌడ్'తో టెక్నాలజీ రంగంలో పెను మార్పులు: సత్య నాదెళ్ల
    తదుపరి వార్తా కథనం
    'క్లౌడ్'తో టెక్నాలజీ రంగంలో పెను మార్పులు: సత్య నాదెళ్ల
    టెక్నాలజీ రంగంలో 'క్లౌడ్'తో పెను మార్పులు: నాదెళ్ల

    'క్లౌడ్'తో టెక్నాలజీ రంగంలో పెను మార్పులు: సత్య నాదెళ్ల

    వ్రాసిన వారు Stalin
    Jan 04, 2023
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టెక్నాలజీ రంగంలో 'క్లౌడ్'తో పెను మార్పులు జరగబోతున్నాయని, దీని వినియోగం కూడా భారీగా పెరిగిందని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో నాదెళ్ల మాట్లాడారు.

    క్లౌడ్ అడాప్షన్ విషయంలో తాము ముందు వరుసలో ఉన్నట్లు స్పష్టం చేశారు. క్లౌడ్ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని, 2025 నాటికి చాలా అప్లికేషన్‌లు క్లౌడ్ అందించే మౌలిక వసతుల ఆధారంగా తయారవుతాయని నాదెళ్ల చెప్పారు. ప్రస్తుతం భారత్‌లోని పలు సంస్థలు క్లౌడ్‌ను వినియోగించుకున్నట్లు వివరించారు.

    భవిష్యత్‌లో దేశంలో టెక్నాలజీ రంగం వృద్ధికి, డిజిటల్ ఇండియాను మరింత ముందుకు తీసుకెళ్లడంలో 'క్లౌడ్'తో పాటు 'కృత్రిమ మేధ(ఏఐ) కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

    మైక్రోసాఫ్ట్‌

    హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్ సర్వీసు కేంద్రం

    క్లౌడ్ వినియోగం వల్ల ఇధన భారం 70 నుంచి 80శాతం తగ్గుందని చెప్పారు సత్య నాదెళ్ల. అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించుకోవడం వల్లే ఈ స్థాయిలో భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

    మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా 60పైగా రీజియన్‌లు, 200పైగా డేటా సెంటర్లు ఉన్నాయన్నారు. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్ సర్వీసు అయిన 'అజూర్' కేంద్రాలు ప్రస్తుతం పుణె, చెన్నై, ముంబయిలో ఉన్నాయని, త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

    క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రతిచోటా అందుబాటులోకి తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ)నుంచి ప్రయోజనాలు పొందాలంటే.. డేటా మౌలిక వసతులు చాలా అవసరమని, అందుకే అందులో తాము పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు.

    నాలుగు రోజుల భారత పర్యటనలో భాగాంగా సత్య నాదేళ్ల హైదరాబాద్‌కు కూడా రానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    టెక్నాలజీ

    ప్రకటన రహిత బేసిక్ ప్లాన్ ను దాచిపెడుతున్న నెట్ ఫ్లిక్స్ నెట్ ఫ్లిక్స్
    ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్ ఆపిల్
    సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ ఫీచర్
    Pixel 7a, Pixel Fold ధర ఎంతో తెలుసా? ఐఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025