NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Deep Blue Aerospace: స్పేస్ టూరిజం వ్యాపారంలోకి చైనాకి చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్.. ఆన్‌లైన్‌లో అంతరిక్ష యాత్రకు టిక్కెట్లు 
    తదుపరి వార్తా కథనం
    Deep Blue Aerospace: స్పేస్ టూరిజం వ్యాపారంలోకి చైనాకి చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్.. ఆన్‌లైన్‌లో అంతరిక్ష యాత్రకు టిక్కెట్లు 
    స్పేస్ టూరిజం వ్యాపారంలోకి చైనాకి చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్.. ఆన్‌లైన్‌లో అంతరిక్ష యాత్రకు టిక్కెట్లు

    Deep Blue Aerospace: స్పేస్ టూరిజం వ్యాపారంలోకి చైనాకి చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్.. ఆన్‌లైన్‌లో అంతరిక్ష యాత్రకు టిక్కెట్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    01:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతరిక్ష యాత్ర అనేది ఒక ఆసక్తికరమైన సాహసం. ఈ ప్రయాణం ఎవరికి కావాలనిపించినా, అందరికీ అది సులభంగా అందుబాటులో లేదు.

    స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ వంటి అమెరికా కంపెనీలు ఇప్పటికే అంతరిక్ష పర్యాటక ప్రయాణాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.

    తాజాగా, చైనాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ కూడా ఈ జాబితాలో చేరింది.

    స్పేస్ టూరిజం సేవలను అందించే ఉద్దేశ్యంతో డీప్ బ్లూ ఏరోస్పేస్ అనే ఆ సంస్థ 2027లో ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

    ఈ యాత్రకు సంబంధించి టికెట్లను ముందుగానే అమ్మకానికి పెడతారు.

    వివరాలు 

    నవంబర్ నెలలో విక్రయానికి మరిన్ని టికెట్లు 

    చైనా స్టార్టప్ డీప్ బ్లూ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ టూరిజం కోసం రెండు సీట్లను విక్రయించనుంది.

    ఈ టికెట్ ధర సుమారు 1.5 మిలియన్ యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.1.77 కోట్లు) అని పేర్కొంది.

    అక్టోబరు 24న సాయంత్రం 6 గంటల నుంచి ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

    యాత్రలో భాగంగా సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ ద్వారా భూ వాతావరణం దాటి, అంతరిక్షం గడువుల వరకు ప్రయాణించి మళ్లీ భూమికి చేరుకుంటారు.

    నవంబర్ నెలలో మరిన్ని టికెట్లను విక్రయానికి ఉంచనున్నట్లు కూడా ప్రకటించారు.

    వివరాలు 

     చైనాలో మరిన్ని కంపెనీలు కూడా స్పేస్ టూరిజంకుప్రణాళికలు 

    డీప్ బ్లూ ఏరోస్పేస్ పునర్వినియోగ రాకెట్లను ఉపయోగించడం ద్వారా వ్యయాలను గణనీయంగా తగ్గించనున్నట్లు పేర్కొంది.

    2025లో మొదటి క్యారియర్ రాకెట్ ప్రయోగాన్ని చేసి, భూమికి సురక్షితంగా తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    ఇదే సమయంలో, చైనాలో మరిన్ని కంపెనీలు కూడా స్పేస్ టూరిజంకు ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

    2028 నాటికి స్పేస్ టూరిజం విమానాలను ప్రారంభించనున్నట్లు చైనా అంతరిక్ష సంస్థ (సీఏఎస్) ప్రకటించింది.

    ఇక, భారతీయుల అద్భుతమైన అంతరిక్ష పర్యాటక కల కూడా త్వరలో నిజమవుతుందనే ఆశ ఉంది.

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2030 నాటికి స్పేస్ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    అంతరిక్షం

    తాజా

    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం

    చైనా

     SCO Summit 2024: ఎస్‌సీఓ తేదీ, ఎజెండా, హాజరవుతువుతున్న దేశాలు ఇవే  కజకిస్థాన్
    China: చైనా 300 ఎక్సాఫ్లాప్ కల: వారు 2025 నాటికి దానిని సాధించగలరా? టెక్నాలజీ
    China's 'artificial sun': అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తున్న చైనా 'కృత్రిమ సూర్యుడు'  టెక్నాలజీ
    china: ప్రపంచంలోని ఇతర దేశాల కంటే రెండింతలు పవన, సౌర విద్యుత్‌ను నిర్మిస్తున్న చైనా  అంతర్జాతీయం

    అంతరిక్షం

    అంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి  వ్యోమగామి
    భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌  ఇస్రో
    భారతీయ ఖగోళ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం; చిన్న గ్రహానికి అతని పేరు  శాస్త్రవేత్త
    జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చీఫ్ ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025