LOADING...
Elon Musk: గ్రోక్‌ 3 ఏఐ మోడల్‌ విడుదల తర్వాత.. ప్రీమియం+ ప్లాన్ ధరల్ని పెంచిన 'ఎక్స్‌' 
గ్రోక్‌ 3 ఏఐ మోడల్‌ విడుదల తర్వాత.. ప్రీమియం+ ప్లాన్ ధరల్ని పెంచిన 'ఎక్స్‌'

Elon Musk: గ్రోక్‌ 3 ఏఐ మోడల్‌ విడుదల తర్వాత.. ప్రీమియం+ ప్లాన్ ధరల్ని పెంచిన 'ఎక్స్‌' 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సామాజిక మాధ్యమం'ఎక్స్' తన ప్రీమియం ప్లస్‌ (Premium+) సబ్‌స్క్రిప్షన్‌ ధరలను భారత్‌లో పెంచింది. ఈ ధరలు గతం కంటే రెట్టింపు అయ్యాయి.ఇది మూడు నెలల్లో రెండోసారి ధర పెంపు కావడం గమనార్హం. ప్రత్యేకంగా,గ్రోక్‌ 3 ఏఐ మోడల్ విడుదలైన తర్వాతే ఈ పెంపు చోటు చేసుకుంది.మస్క్‌కు చెందిన కృత్రిమ మేధస్సు (AI) కంపెనీ 'ఎక్స్‌ఏఐ (xAI)' ఇటీవల గ్రోక్‌ 3 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఏఐ మోడల్‌ను వినియోగించాలంటే 'ఎక్స్‌'లో ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉందని కంపెనీ తెలిపింది. దాంతో పాటు,ఈ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధరను పెంచింది.ఇప్పటివరకు,ప్రీమియం ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర భారత్‌లో నెలకు ₹1,750 ఉండేది.

వివరాలు 

ఇతర ప్లాన్ల ధరలలో మార్పు లేదు

తాజా పెంపుతో,ఈ ధర ₹3,470కి చేరింది. అదే విధంగా,వార్షిక ప్లాన్‌ ధర ₹18,300 నుండి ₹34,340కి పెంచబడింది,అంటే దాదాపు రెట్టింపు అయింది. 'ఎక్స్' తన ఆదాయాన్ని పెంచుకోవడానికి 2023 అక్టోబర్‌లోనే ప్రీమియం ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో ఈ ప్లాన్‌ ధర ₹1,300గా ఉండేది.అనంతరం 2023 డిసెంబర్‌లో దీని ధరను ₹1,750కి పెంచింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ₹3,470కి పెంచింది.అయితే, ఇతర ప్లాన్ల ధరలను మార్పు చేయలేదు. ప్రస్తుతం, 'ఎక్స్‌'లో బేసిక్‌, ప్రీమియం,ప్రీమియం ప్లస్‌ అనే మూడు రకాల సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. బేసిక్‌ ప్లాన్‌ ధర నెలకు ₹244,ప్రీమియం ప్లాన్‌ ధర నెలకు ₹650గా ఉంది.యాడ్‌-ఫ్రీ అనుభూతి,దీర్ఘ ఆర్టికల్స్‌ రాయడం వంటి ప్రత్యేక ఫీచర్లు ప్రీమియం ప్లాన్లలో లభిస్తున్నాయి.