NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఆన్ లైన్ మోసాలను అడ్డుకునేందుకు గూగుల్ పరిచయం చేస్తున్న డిజి కవచ్ 
    తదుపరి వార్తా కథనం
    ఆన్ లైన్ మోసాలను అడ్డుకునేందుకు గూగుల్ పరిచయం చేస్తున్న డిజి కవచ్ 
    గూగుల్ పరిచయం చేస్తున్న డిజి కవచ్ ప్రాజెక్ట్

    ఆన్ లైన్ మోసాలను అడ్డుకునేందుకు గూగుల్ పరిచయం చేస్తున్న డిజి కవచ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 19, 2023
    02:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చేసింది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కారణంగా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతోంది.

    అయితే ఈ టెక్నాలజీ కారణంగా ఆన్ లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ లో అనేక మోసాలు చేసి అకౌంట్లో నుంచి డబ్బులను మాయం చేస్తున్నారు.

    ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు గూగుల్ సంస్థ డిజి కవచ్ అనే ప్రాజెక్టును పరిచయం చేస్తోంది. గూగుల్ ఫర్ ఇండియా 2023 ఈవెంట్లో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసింది.

    దీని ప్రకారం భారతీయ వినియోగదారులు ఆన్ లైన్ మోసాలకు గురికాకుండా ఉండాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టును భారతదేశంలో పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తోంది.

    ఆ తర్వాత ఇతర దేశాలకు కూడా ఈ ప్రాజెక్టును తీసుకెళ్లనుంది.

    Details

    ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో మోసాలను అడ్డుకునే ప్రాజెక్ట్ 

    ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఎట్ గూగుల్ APAC వైస్ ప్రెసిడెంట్ సైకత్ మిత్రా, గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ లో మాట్లాడుతూ భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం చేస్తున్న ఒక బిలియన్ మంది యూజర్ల భద్రత కోసం డిజి కవచ్ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని అన్నారు.

    డిజిట్ కవచ్ అనేది ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఆన్ లైన్ మోసగాళ్లను అడ్డుకుంటుందని తెలియజేశారు.

    ఆన్ లైన్ మోసాలను అడ్డగించడానికి ముఖ్యంగా ఆర్థిక మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తో గూగుల్ జట్టు కట్టిందని మిత్రా తెలియజేసారు.

    Details

    డిజి కవచ్ లాంచ్ తేదీ ఎప్పుడంటే? 

    డిజి కవచ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆన్ లైన్ లో ఆర్థిక మోసాలను అరికట్టడం. ఆర్బీఐ ఎన్పీసీఐ మొదలైన వాటితో గూగుల్ జట్టు కట్టిన తర్వాత గూగుల్ పే లో 12 వేల కోట్ల మోసాన్ని అడ్డుకుంది.

    ఆన్ లైన్ అపాయాలనుండి భారత పౌరులను కాపాడడానికి ఆర్బీఐ, గూగుల్ సంస్థలు చాలా పగడ్బందీగా పనిచేస్తున్నాయని మిత్ర తెలియజేశారు.

    డిజి కవచ్ ప్రాజెక్టు లాంచ్ తేదీని ఇంకా వెల్లడి చేయలేదు. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు లాంచ్ కానుందని సమాచారం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును మరింత మెరుగులు దిద్దుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గూగుల్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    గూగుల్

    10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    గూగుల్ డిజిటల్ ప్రకటనల గుత్తాధిపత్యంపై యూఎస్ఏ ప్రభుత్వం సీరియస్ ప్రకటన
    ఆండ్రాయిడ్ విభాగంలో తగ్గనున్న గూగుల్ ఆధిపత్యం భారతదేశం
    ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన ఉద్యోగుల తొలగింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025