PM Modi postcard: అంతరిక్షంలోకి ప్రధాని మోదీ రాసిన పోస్ట్కార్డు.. విక్రమ్-1 ప్రయోగానికి సర్వం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మరో కీలక ఘట్టానికి వేదిక సిద్ధమైంది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ శనివారం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి 'మిషన్ ఆగమన్' పేరుతో 'విక్రమ్-1' రాకెట్ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగంలో సాంకేతిక పరికరాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రాసిన చేతిరాత పోస్ట్కార్డు కూడా అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఆ పోస్ట్కార్డుపై ప్రధాని మోదీ 'వందేమాతరం' అని స్వహస్తాలతో రాశారు. అంతేకాదు, ఇస్రో ప్రస్తుత, మాజీ ఛైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, స్కైరూట్ బృంద సభ్యులు, సంస్థ పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు రాసిన వందలాది చేతిరాత పోస్ట్కార్డులు కూడా ఈ మిషన్లో భాగంగా అంతరిక్ష ప్రయాణం చేయనున్నాయి.
వివరాలు
2022 నవంబర్లో 'విక్రమ్-S'
భారత భూభాగం నుంచి కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపేందుకు సిద్ధమైన తొలి ప్రైవేట్ రాకెట్గా విక్రమ్-1 ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
దాదాపు ఏడు అంతస్తుల భవనం ఎత్తుతో రూపొందిన ఈ రాకెట్ను పూర్తిగా కార్బన్ కాంపోజిట్ పదార్థాలతో నిర్మించారు.
ఇందులో ఉపయోగించిన ఇంజిన్లను అత్యాధునిక 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేయడం విశేషం.
భూమికి సమీప కక్ష్యలోకి సుమారు 350కిలోగ్రాముల బరువును మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది.
ఇంతకుముందు 2022 నవంబర్లో స్కైరూట్ సంస్థ'విక్రమ్-S' పేరిట రూపొందించిన చిన్న రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.
ఆ విజయంతో మరింత ముందడుగు వేసిన సంస్థ, ఇప్పుడు పూర్తి స్థాయి ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చగల విక్రమ్-1 ద్వారా భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది.
వివరాలు
ముగ్గురు దిగ్గజ శాస్త్రవేత్తలకు వినూత్న నివాళి
విక్రమ్-1 రాకెట్ సాంకేతిక పరికరాలు, చేతిరాత పోస్ట్కార్డులను మాత్రమే కాకుండా ప్రత్యేకమైన మైక్రో ఆర్ట్ను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది.
భారత అంతరిక్ష, శాస్త్ర సాంకేతిక రంగానికి విశిష్ట సేవలు అందించిన సర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ విగ్రహాలను ఈ మిషన్లో పంపనున్నారు.
మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టెవాడ 18 క్యారెట్ల బంగారంతో అతి చిన్న రాకెట్ నమూనాను రూపొందించి, అందులో ఈ ముగ్గురు మహానుభావుల సూక్ష్మ విగ్రహాలను అత్యంత నైపుణ్యంతో చెక్కారు.
భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో ప్రపంచ వేదికపై ప్రత్యేక స్థానానికి చేర్చిన ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నివాళిగా స్కైరూట్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విక్రమ్-1లో మోదీ చేతిరాతకు ప్రత్యేక స్థానం
Among the payloads on Vikram-1 Test Flight-1 is something truly special—a handwritten postcard from Hon’ble Prime Minister Shri @narendramodi with the words, “Vande Mataram.” 🇮🇳🚀
— Skyroot Aerospace (@SkyrootA) July 17, 2026
It travels to space alongside handwritten messages from our team, investors, policymakers, and… pic.twitter.com/sJajN6NiVJ