Loading...
'eyes in space': ఆకాశంలోనే శత్రు క్షిపణులకు చెక్.. అంతరిక్షంలో భారత్ 'నిఘా నేత్రాలు'..
ఆకాశంలోనే శత్రు క్షిపణులకు చెక్.. అంతరిక్షంలో భారత్ 'నిఘా నేత్రాలు'..

'eyes in space': ఆకాశంలోనే శత్రు క్షిపణులకు చెక్.. అంతరిక్షంలో భారత్ 'నిఘా నేత్రాలు'..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత రక్షణ రంగం అత్యాధునిక సాంకేతికత దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. శత్రు దేశాల నుంచి ప్రయోగించే క్షిపణులను సెకన్ల వ్యవధిలోనే గుర్తించి, వాటిని గగనతలంలోనే అడ్డుకునేందుకు ఉపయోగపడే అంతరిక్ష ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను భారత్ వేగంగా అభివృద్ధి చేస్తోంది. స్పేస్‌-బేస్డ్ ఇన్‌ఫ్రారెడ్ ఎర్లీ వార్నింగ్ వ్యవస్థగా పిలిచే ఈ సాంకేతికతను 'అంతరిక్షంలో కళ్లు'గా అభివర్ణిస్తున్నారు. ఆగస్టు 23న నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఈ కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. క్షిపణిని ప్రయోగించిన సమయంలో దాని ఇంజిన్ల నుంచి భారీగా వెలువడే వేడిని ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు గుర్తిస్తాయి.

వివరాలు 

ఆపరేషన్ సిందూర్ అనుభవంతో..

అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు ఈ ఉష్ణ సంకేతాలను ప్రయోగం జరిగిన కొద్ది సెకన్లలోనే పసిగట్టగలవు.

దీంతో శత్రు క్షిపణి ప్రయాణ మార్గాన్ని ముందుగానే గుర్తించి, దానిని అడ్డుకునేందుకు భారత రక్షణ దళాలకు అదనపు సమయం లభిస్తుంది.

గతంలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ఎదురైన పరిణామాలు ఇలాంటి వ్యవస్థ అవసరాన్ని మరింత స్పష్టం చేశాయి.

ఆ సమయంలో పాకిస్థాన్ నుంచి ప్రయోగించిన ఓ హైస్పీడ్ క్షిపణి ఢిల్లీ వైపు దూసుకురాగా, హర్యానాలోని సిర్సా వద్ద భారత వాయు రక్షణ వ్యవస్థ దానిని అడ్డుకుంది.

అయితే అప్పటికి క్షిపణి లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం ఒకటి, రెండు నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది.

వివరాలు 

ఆపరేషన్ సిందూర్ అనుభవంతో..

భూమిపై ఏర్పాటు చేసిన రాడార్లకు భూమి వక్రత కారణంగా ఒక నిర్దిష్ట పరిధి వరకు మాత్రమే నిఘా సాధ్యమవుతుంది.

ఫలితంగా క్షిపణి ముప్పును గుర్తించిన తర్వాత స్పందించేందుకు అందుబాటులో ఉండే సమయం తగ్గిపోతుంది.

ఈ పరిమితిని అధిగమించడమే అంతరిక్ష ఆధారిత సెన్సార్ల ప్రధాన ఉద్దేశం.

శత్రువు క్షిపణిని ప్రయోగించిన వెంటనే గుర్తించి, ముందుగానే హెచ్చరికలు అందించడం ద్వారా రక్షణ వ్యవస్థకు మరింత సమయం లభిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు 

మూడు దశల్లో క్షిపణి ప్రయాణం

బాలిస్టిక్ క్షిపణి సాధారణంగా మూడు ప్రధాన దశల్లో ప్రయాణిస్తుంది. మొదటిది 'బూస్ట్' దశ. ఈ సమయంలో క్షిపణి ఇంజిన్లు మండుతూ అత్యధిక ఉష్ణాన్ని విడుదల చేస్తాయి.

అంతరిక్షంలోని ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు ఈ వేడిని ప్రయోగం జరిగిన సెకన్లలోనే గుర్తించగలవు. రెండోది 'మిడ్‌కోర్స్' దశ.

ఈ సమయంలో క్షిపణి వాతావరణం వెలుపల ప్రయాణిస్తుంది. చివరిది 'టెర్మినల్' దశ.

ఈ దశలో క్షిపణి అత్యంత వేగంతో లక్ష్యం వైపు దూసుకొస్తుంది. కొన్ని సందర్భాల్లో దీని వేగం మాక్ 15కుపైగా ఉండొచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

మూడు దశల్లో క్షిపణి ప్రయాణం

ప్రస్తుతం భూస్థిత రాడార్లు ప్రధానంగా టెర్మినల్ దశలో క్షిపణిని గుర్తించే అవకాశం ఉంటుంది.

అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు బూస్ట్ దశలోనే దానిని గుర్తించి హెచ్చరికలు పంపగలవు. దీంతో 'కిల్ చైన్'గా పిలిచే గుర్తింపు, ట్రాకింగ్, ధ్వంసం ప్రక్రియను మరింత ముందుగానే ప్రారంభించవచ్చు.

ఫలితంగా క్షిపణి వాతావరణంలోకి ప్రవేశించే ముందే లేదా ఆ తర్వాత కూడా దానిని అడ్డుకునే అవకాశాలు పెరుగుతాయి.

ఈ తరహా క్షిపణి విధ్వంసక పరీక్షలను డీఆర్‌డీఓ ఇప్పటికే విజయవంతంగా నిర్వహించింది.

వివరాలు 

ప్రభుత్వం-ప్రైవేట్ రంగం భాగస్వామ్యం

ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో ప్రభుత్వ సంస్థలతో పాటు భారత ప్రైవేట్ స్టార్టప్‌లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.

బెంగళూరుకు చెందిన 'దిగంతర' స్టార్టప్ తన 'ఆల్బట్రాస్' ఉపగ్రహాల ద్వారా క్షిపణి ప్రయోగాలను బూస్ట్ దశలోనే గుర్తించే సాంకేతికతపై పనిచేస్తోంది.

అహ్మదాబాద్‌కు చెందిన 'శాట్‌లియో ల్యాబ్స్' 15 ఉపగ్రహాలతో కూడిన థర్మల్ అబ్జర్వేషన్ వ్యవస్థను రూపొందిస్తోంది.

క్షిపణి ప్రయోగాల వంటి అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ఘటనలను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని రియల్‌టైమ్‌లో అందించడం ఈ వ్యవస్థ లక్ష్యం.

వివరాలు 

ప్రభుత్వం-ప్రైవేట్ రంగం భాగస్వామ్యం

ఇదే సమయంలో కేంద్ర భద్రతా కేబినెట్ కమిటీ(CCS)కూడా 'స్పేస్-బేస్డ్ సర్వైలెన్స్ ఫేజ్-3'(SBS-3) కార్యక్రమానికి ఆమోదం తెలిపింది.

సుమారు రూ.27,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో 2029 నాటికి మొత్తం 52 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోహరించనున్నారు.

ఇందులో 21 ఉపగ్రహాలను ఇస్రో, 31 ఉపగ్రహాలను ప్రైవేట్ సంస్థలు రూపొందించనున్నాయి.

ఈ ఉపగ్రహాల నెట్‌వర్క్ ద్వారా నిరంతర నిఘాతో పాటు శత్రు దేశాల మొబైల్ క్షిపణి లాంచర్ల కదలికలను గుర్తించడం,ట్రాకింగ్ చేయడం,కమ్యూనికేషన్ సంబంధిత అవసరాలను పర్యవేక్షించడం వంటి అనేక ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి.

అంతరిక్ష నిఘా,భూస్థిత రాడార్లు,క్షిపణి రక్షణ వ్యవస్థలను అనుసంధానించే ఈ బహుళ అంచెల వ్యూహంతో ఆకస్మిక దాడుల ముప్పును తగ్గించడం,దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT