NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు
    గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

    ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 21, 2022
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ లో భాగంగా ఇండియాకి వచ్చిన సుందర్ పిచాయ్, టెక్నాలజీ పరంగా ఎన్నో అవకాశాలున్న దేశంగా ఇండియా ఉందని పేర్కొన్నాడు.

    ప్రస్తుతం గూగుల్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తోంది. 100 భారతీయ భాషల్లో స్పీచ్, టెక్స్ట్ తో సెర్చ్ చేసే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ను డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించారు.

    అలాగే ప్రపంచంలోని 1000భాషల్లో ఈ సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. మారుమూల పల్లెటూరు ప్రజలు కూడా గూగుల్ ని వాడేలా ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ను తయారు చేస్తున్నామని అన్నారు.

    ఇండియా గురించి మాట్లాడిన సుందర్ పిచాయ్, టెక్నాలజీ రంగంలో భారతదేశం దూసుకుపోతుందని, ముఖ్యంగా డిజిటల్ విభాగంలో మెరుగైన వృద్ధి సాధించినట్లు తెలిపాడు.

    గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

    డిజిటల్ లో దూకుడు

    2020లో ఇండియాలో 10బిలియన్ డాలర్లు డిజిటల్ సర్వీసెస్ లో ఇన్వెస్ట్ చేస్తామని గూగుల్ ప్రకటించింది. ప్రస్తుతం ఆ ఇన్వెస్ట్ మెంట్స్ ని పరిశీలించానని సుందర్ పిచాయ్ చెప్పారు.

    ఈ గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ లో ఇండియాకు చెందిన ఐటీ శాఖమంత్రి పాల్గొన్నారు. మరికొద్ది రోజుల్లో టెక్నాలజీలోఇండియా దూసుకుపోనుందని, దానికి సాక్ష్యంగా యూపీఐ సర్వీసులు నిలిచాయని అన్నారు.

    ఇదే సమావేశంలో తమ తర్వాతి పథకాల గురించి వివరిస్తూ, ప్రపంచంలోని వెయ్యి భాషల్లో సమాచారాన్ని జనాలకు ఇచ్చేలా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రూపొందిస్తున్నామని తెలిపారు.

    మొత్తానికి గూగుల్ ముందు పెద్ద ప్లానే ఉంది. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి సరికొత్త విప్లవాన్ని సృష్టించనున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని కేంద్ర కేబినెట్
    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి ఒడిశా
    Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి  ఇరాన్
    AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు మనీష్ సిసోడియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025