
Nuclear Missile: నౌకాదళం నాల్గవ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిస్సైల్ జలాంతర్గామిని ఆవిష్కరించిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ అణు శక్తిని పెంచుకోవడానికి మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ తీరంలో నౌకాదళం 4వ అణు సామర్థ్యంతో కూడిన దేశంలోనే తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి (ఎస్ఎస్బీఎన్)ని ఆవిష్కరించింది.
ఈ కార్యక్రమం విశాఖపట్టణంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో జరగినట్లు సమాచారం.
దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్కు శంకుస్థాపన చేసిన మర్నాడే ఈ కార్యక్రమం జరిగిందని కథనాలు తెలిపాయి.
ఈ ఏడాది ఆగస్టులో, ఎస్ఎస్బీఎన్ అరిఘాత్ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నౌకాదళానికి అందించారు.
వచ్చే ఏడాదిలో, ఈ శ్రేణిలో నాలుగో సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిధమాన్ను సిద్ధం చేయనున్నట్లు నేవీ అధికారులు పేర్కొన్నారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శత్రువులను ఎదుర్కొనడంలో జలాంతర్గాములకు మెరుగైన పాత్ర ఉంటుందని వారు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత నౌకాదళం 4వ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిస్సైల్
❗️#NavalNews #Shipbuilding
— Saturnax 🇸🇰🇪🇺🇺🇦 (@Saturnax1) October 22, 2024
Indian Navy launched 4th Arihant-class nuclear-powered ballistic missile submarine S-4 on October 16, 2024, at Ship Building Center (SBC) in Visakhapatnam.
Infographics by @CovertShores
More info on Arihant-class: https://t.co/u8fQsCStOZ
Source:… pic.twitter.com/wQ9X6pn4Oj