రాజ్‌నాథ్ సింగ్: వార్తలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్ 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గురువారం కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.

ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించనున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం

అరుణాచల్‌ప్రదేశ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మంగళవారం, బుధవారం పర్యటించనున్నారు. తవాంగ్ సెక్టార్‌లోని ఎల్‌ఎసీ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.