NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
    కర్ణాటక తుమకూరులో ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Feb 06, 2023
    06:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది.

    ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలో లైట్ యుటిలిటీ హెలికాప్టర్‌ను ప్రధాని ఆవిష్కరించారు.

    రక్షణ రంగంలో స్వావలంబన సాధన దిశగా సాగుతున్న ప్రయాణంలో హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవం ఓ మైలురాయి అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

    ప్రధాని మోదీ

    2016లో హెలికాప్టర్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన

    2016లో తుమకూరు హెలికాప్టర్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇది హెలికాప్టర్‌లను నిర్మించే సామర్థ్యాన్ని, పర్యావరణ వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం దీని నిర్మాణాన్ని చేపట్టింది.

    లైట్ కంబాట్ హెలికాప్టర్ (ఎల్‌సీహెచ్), ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్) వంటి ఇతర హెలికాప్టర్‌లను తయారు చేయడానికి కాకుండా మరమ్మతుల కోసం భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీని విస్తరించనున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఉత్పత్తి చేసే సివిల్ ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లను ఎగుమతి చేసే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది.

    ఈ ఫ్యాక్టరీ భారతదేశ అవసరాలను స్వదేశీ పద్ధతిలో తీర్చడానికి వీలు కల్పిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా దేశంలో హెలికాప్టర్ రూపకల్పన, అభివృద్ధి, తయారీలో స్వయం ప్రతిపత్తిని సాధించిన దేశంగా భారత్ నిలుస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    కర్ణాటక
    ప్రధాన మంత్రి
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    నరేంద్ర మోదీ

    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం నరేంద్ర మోదీ

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం అరుణాచల్ ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025