NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
    భారతదేశం

    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 06, 2023, 06:39 pm 0 నిమి చదవండి
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
    కర్ణాటక తుమకూరులో ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలో లైట్ యుటిలిటీ హెలికాప్టర్‌ను ప్రధాని ఆవిష్కరించారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధన దిశగా సాగుతున్న ప్రయాణంలో హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవం ఓ మైలురాయి అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

    2016లో హెలికాప్టర్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన

    2016లో తుమకూరు హెలికాప్టర్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇది హెలికాప్టర్‌లను నిర్మించే సామర్థ్యాన్ని, పర్యావరణ వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం దీని నిర్మాణాన్ని చేపట్టింది. లైట్ కంబాట్ హెలికాప్టర్ (ఎల్‌సీహెచ్), ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్) వంటి ఇతర హెలికాప్టర్‌లను తయారు చేయడానికి కాకుండా మరమ్మతుల కోసం భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీని విస్తరించనున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఉత్పత్తి చేసే సివిల్ ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లను ఎగుమతి చేసే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది. ఈ ఫ్యాక్టరీ భారతదేశ అవసరాలను స్వదేశీ పద్ధతిలో తీర్చడానికి వీలు కల్పిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా దేశంలో హెలికాప్టర్ రూపకల్పన, అభివృద్ధి, తయారీలో స్వయం ప్రతిపత్తిని సాధించిన దేశంగా భారత్ నిలుస్తుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కర్ణాటక
    బసవరాజ్ బొమ్మై
    నరేంద్ర మోదీ
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    టీమిండియా ప్లేయర్లకు స్వల్ప విరామం టీమిండియా
    ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ ఎన్టీఆర్ 30
    మార్చి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    అమరవీరుల దినోత్సవం 2023: సంవత్సరంలో రెండుసార్లు జరుపుకునే దీని ప్రత్యేకత మీకు తెలుసా? ముఖ్యమైన తేదీలు

    కర్ణాటక

    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! అసెంబ్లీ ఎన్నికలు
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? బెంగళూరు
    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ ఎన్ఐఏ

    బసవరాజ్ బొమ్మై

    కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ కర్ణాటక

    నరేంద్ర మోదీ

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష ప్రధాన మంత్రి
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్

    రాజ్‌నాథ్ సింగ్

    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం అరుణాచల్ ప్రదేశ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023