NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
    తదుపరి వార్తా కథనం
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
    కర్ణాటక ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నియామకం

    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

    వ్రాసిన వారు Stalin
    Feb 04, 2023
    03:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను, కో-ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలైని అధిష్టానం నియమించింది.

    2023లో తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అందులో కర్ణాటక ఒకటి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి.

    మే నెలలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది.

    ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కర్ణాటకపై కేంద్రం ప్రత్యేక ప్రేమను కనబర్చింది. ఆ రాష్ట్రానికి భారీగా నిధులను కేటాయించింది.

    కర్ణాటక

    ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని విజయతీరాలకు చేర్చిన ప్రధాన్

    అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ప్రధాన్ ఉన్నారు. రాష్ట్రంతో పాటు పార్టీలోని అంతర్గత వివాదాలను పరిష్కరించి ఆ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించారు. దీంతో అధిష్టానం నంచి ప్రశంసలు పొందారు.

    కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బీజేపీ ఇబ్బంది మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆ వివాదాలను పరిష్కరించి, రాష్ట్రంలో తిరిగి బీజేపీ అధికారంలో తెస్తారనే విశ్వాసంతోనే ప్రధాన్ ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు తెలుస్తోంది.

    విద్యాసంస్థల్లో హిజాబ్‌, హలాల్ ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్‌లు, ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్ల వాడకంపై ఆంక్షల వంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి.

    లింగాయత్ వర్గాలనికి చెందిన బీఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రిగా తొలగించడం బీజేపీలో ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశమూ లేకపోలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    కేంద్రమంత్రి

    తాజా

    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర

    కేంద్రమంత్రి

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025