NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ
    తదుపరి వార్తా కథనం
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ
    అసెంబ్లీ ఎన్నికల కోసం రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ

    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ

    వ్రాసిన వారు Stalin
    Jan 17, 2023
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మరికొన్ని నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ మళ్లీ రాష్ట్రంలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది.

    బడ్జెట్ సెషన్ అయ్యాక.. ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో 'రథయాత్ర' చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసే ఈ రథయాత్రకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు.

    'రథయాత్ర'కు సంబంధించిన తుది నిర్ణయాలు ఇంకా జరగలేదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ జాతీయ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కర్ణాటకలో 'రథయాత్ర'పై కూడా నిర్ణయం జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

    బీజేపీ

    హిందుత్వ అజెండా, మోదీ ఛరిష్మాతో ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ

    కర్ణాటకలో జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాగా.. ఆ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప గైర్హాజరయ్యారు. వాస్తవానికి ఆయనను సీఎంగా తొలగించినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను బుజ్జగించేందుకు ప్రధాని మోదీ పిలుపించుకొని మాట్లాడారు.

    ఓబీసీ కోటా కింద పంచమసాలీ ఉపవర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వంపై విజయపుర బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈయనపై పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలా చేస్తే.. పార్టీకి పంచమసాలీ సామాజిక వర్గం దూరం అవుతందనే హెచ్చరికలు వస్తున్నాయి.

    ఎన్నిఅవాంతరాలు ఎదురైనా హిందుత్వ అజెండా, మోదీ ఛరిష్మాతో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాలో బీజేపీ ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    బీజేపీ

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా

    బీజేపీ

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025