
Rajnath Singh: 'అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు': రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ఒత్తిడి చూపించడానికి అమెరికా 50 శాతం సుంకాలు (Trump Tariffs) విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు భారత ప్రభుత్వం దీనిపై ప్రత్యక్ష ప్రతిస్పందన ఇవ్వలేదు. ఈ విషయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "అవును, ఇప్పటివరకు ప్రభుత్వం ప్రత్యక్షంగా స్పందించలేదు. విస్తృత దృష్టికోణం కలిగి, గొప్ప మనసు ఉన్న వారు ప్రతి విషయం పై వెంటనే స్పందించరు" అని తెలిపారు. ప్రస్తుతం మొరాకో పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రవాస భారతీయులతో రాజ్నాథ్ సింగ్
#WATCH | Rabat, Morocco: On 50% tariff, imposed by the US, at the interaction with the Indian community in Morocco, Defence Minister Rajnath Singh says, "We didn't react...Those who are broad-minded and big-hearted, do not react on anything immediately." pic.twitter.com/m0X8pooThz
— ANI (@ANI) September 22, 2025