Page Loader
India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ
గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ

India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 14, 2024
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ త్వరలో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. సరిహద్దు సమస్యలు, ప్రాంతీయ స్థిరత్వం ఈ చర్చల ముఖ్యాంశాలుగా ఉంటాయని తెలుస్తోంది. ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశాలకు అనుబంధంగా వచ్చే వారం ఈ సమావేశం జరగవచ్చని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) పరిధిలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్‌, చైనా కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వద్ద కొనసాగుతుందని, రెండు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చని ఇరు దేశాలు ఒప్పుకున్నాయి.

వివరాలు 

20మంది భారత సైనికులు వీరమరణం

ఈఒప్పందంలో భాగంగా,కీలక ప్రాంతాల నుంచి సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. 2020 జూన్‌ 15న,తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ భారత్‌-చైనా సైనికుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘర్షణలో,తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయినా,ఆ సంఖ్యను ఇంకా వెల్లడించలేదు.చాలా నెలల తర్వాత ఐదు చైనా సైనికులు చనిపోయారని అధికారికంగా అంగీకరించింది. ఈ ఘర్షణల కారణంగా ఇరుదేశాలు ఎల్‌ఏసీ వద్ద భారీగా బలగాలను మోహరించాయి. అయినప్పటికీ,ఈ గస్తీ ఒప్పందంతో ఈ ఉద్రిక్తతలకు ముగింపు వచ్చాయి.ఈపరిణామాల మధ్య రాజ్‌నాథ్‌ సింగ్‌,డోంగ్‌ జున్‌ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.