
Rajnath Singh:'ఉగ్రవాద కేంద్రాలు..ఇకపై సురక్షితం కాదు': SCO సమావేశంలో పాకిస్తాన్ లక్ష్యంగా భారత్
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని దేశాలు సరిహద్దు ఉగ్రవాదాన్ని తమ అధికారిక విధానంగా మలుచుకున్నాయంటూ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ను ఉద్దేశించి తీవ్రంగా విమర్శిస్తూ, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగలేవని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ను లక్ష్యంగా చేసుకుని, కొన్ని దేశాలు సరిహద్దు ఉగ్రవాదాన్ని సాధనంగా వినియోగిస్తున్నాయన్న ఆయన, పాక్ బహిరంగంగానే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని ఆరోపించారు. ఇటువంటి దేశాలపై SCO వంటి అంతర్జాతీయ వేదికలలో ముక్తకంఠంతో విమర్శించడానికి వెనుకాడకూడదని అన్నారు.
వివరాలు
పహల్గామ్ ఉగ్రదాడికి భాద్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్
సమావేశంలో పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించిన రాజ్నాథ్ సింగ్, ఆ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించిందని తెలిపారు. ఈ ఘాతుక దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఉగ్రవాదులు ప్రజల మతాలను గుర్తించి లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారని వివరించారు. భారతదేశం సరిహద్దు ఉగ్రదాడులను అడ్డుకునేందుకు,ఉగ్రవాదానికి కౌంటర్ చర్యల భాగంగా మే 7న 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా ప్రారంభించిందని వెల్లడించారు.
వివరాలు
సరిహద్దుల్లోని ఉగ్ర శిబిరాలు ధ్వంసం
ఈ ఆపరేషన్ ద్వారా సరిహద్దుల్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఉగ్రవాదం, అడ్డదారుల శక్తులు,ఉగ్రవాద గుంపుల చేతిలో సమూహవిధ్వంస ఆయుధాల విస్తరణ వల్ల శాంతి, భద్రత,సౌభ్రాతృత్వం కష్టతరమవుతుందని హెచ్చరించారు. ఇలాంటి దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు SCO సభ్యదేశాలు.. భారత్, చైనా, కజకిస్తాన్, కిర్గిజ్స్థాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్.. ఐక్యంగా నిలవాలంటూ రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.