NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Rajnath Singh: అలర్ట్‌గా ఉండాలి.. పొరుగు దేశాల కవ్వింపు చర్యలపై హెచ్చరిక
    తదుపరి వార్తా కథనం
    Rajnath Singh: అలర్ట్‌గా ఉండాలి.. పొరుగు దేశాల కవ్వింపు చర్యలపై హెచ్చరిక
    అలర్ట్‌గా ఉండాలి.. పొరుగు దేశాల కవ్వింపు చర్యలపై హెచ్చరిక

    Rajnath Singh: అలర్ట్‌గా ఉండాలి.. పొరుగు దేశాల కవ్వింపు చర్యలపై హెచ్చరిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 12, 2024
    03:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దేశ సరిహద్దుల్లో భారత సైన్యం పూర్తిగా అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు.

    సరిహద్దుల్లో ఉద్రిక్తతలు లేకపోవడం సైన్యం అప్రమత్తత వల్లనే జరిగిందని ఆయన తెలిపారు.

    అయితే, ఈ విషయంలో అలసత్వం చేయకూడదని, పొరుగు దేశాల నుంచి ఎప్పుడైనా కవ్వింపు చర్యలు రావచ్చని ఆయన హెచ్చరించారు.

    శనివారం విజయదశమి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఉన్న సుక్నా కాంట్‌ను సందర్శించిన ఆయన, అక్కడ ఆర్మీ జవాన్లతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు.

    ఆయుధ పూజ అనంతరం జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్‌నాథ్‌ సింగ్‌, సరిహద్దుల్లో భారత సైన్యం సదా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోందని ప్రశంసించారు.

    Details

    చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక 'దసరా'

    దేశ భద్రత విషయంలో మరింత దృఢంగా నిలబడాలని సూచించారు. విజయ దశమి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

    తాము ఏ ఇతర దేశంపై దాడి చేయడం లేదని, ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు.

    అయితే మన దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఎవ్వరైనా విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే, వారితో పోరాడటమే ఒక్కటే మార్గమని రాజ్‌నాథ్‌ సింగ్‌ తేల్చిచెప్పారు.

    ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల దృష్ట్యా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్
    కేంద్రమంత్రి

    తాజా

    China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం  చైనా
    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్
    Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర  ఉత్తరాఖండ్
    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రక్షణ శాఖ మంత్రి

    కేంద్రమంత్రి

    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' కోవిడ్
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025