NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్ 
    పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్

    Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    05:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' విషయం మనందరికి తెలిసిందే.

    ఈ చర్యకు ప్రతీకారంగా భారత్‌లోని సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు పాకిస్తాన్‌ యత్నించింది.

    అయితే, భారత భద్రతా దళాలు ఆ యత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టాయి.

    ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సహనాన్ని బలహీనతగా భావిస్తే, 'ఆపరేషన్‌ సిందూర్‌' తరహా చర్యలకు భారత్‌ వెనుకాడదని ఆయన హెచ్చరించారు.

    'నేషనల్‌ క్వాలిటీ కాంక్లేవ్‌' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, దేశ భద్రత విషయంలో భారత్‌ ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడదని స్పష్టం చేశారు.

    వివరాలు 

    ఉగ్రవాద స్థావరాలను భారత్‌ సమర్థవంతంగా నాశనం చేసింది 

    "మేము ఎప్పుడూ శాంతిని, సంయమనాన్ని ప్రాముఖ్యత ఇస్తాం.చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అనే నమ్మకంతో వ్యవహరిస్తాం. అయితే దీన్ని మా సహనాన్ని పరీక్షించే అవకాశంగా తీసుకోవడం సరైంది కాదు. ఎవరైనా భారత్‌ ఓర్పును తక్కువగా అంచనా వేస్తే, ఆపరేషన్‌ సిందూర్‌ లాంటి చర్యల పరిణామాలకు సిద్ధంగా ఉండాలి," అని రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు.

    ఆపరేషన్‌ సిందూర్‌ అమలులో భారత బలగాలు అత్యుత్తమ ప్రణాళికతో, అద్భుతమైన ఖచ్చితత్వంతో ముందడుగు వేశాయని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

    పాకిస్తాన్‌తో పాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్‌ సమర్థవంతంగా నాశనం చేసిందని వెల్లడించారు.

    వివరాలు 

    భారత సాయుధ దళాల ధైర్యాన్ని ప్రశంసించిన మంత్రి 

    ఈ దాడుల్లో అనేకమంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం గలవంతమైన ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించిందని ఆయన కొనియాడారు.

    సామాన్య ప్రజలకు ఏ విధమైన హాని జరగకుండా ఈ చర్యను విజయవంతంగా నిర్వహించామన్నారు.

    అత్యాధునిక సాంకేతిక పరికరాల వినియోగం, అత్యుత్తమంగా శిక్షణ పొందిన సైనికుల సమర్థత కారణంగానే ఈ విజయం సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్

    #WATCH | Delhi: Defence Minister Rajnath Singh says, "We have always played the role of a responsible nation. We have always been in favour of resolving problems through dialogue. But this does not mean that anyone should take unfair advantage of our patience. If anyone tries to… pic.twitter.com/V1bREXfm2f

    — NewsMobile (@NewsMobileIndia) May 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    LSG vs RCB: లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..క్వాలిఫయర్‌-1కు ఆర్సీబీ  ఐపీఎల్
    IPL: ఐపీఎల్ 2025.. కోహ్లీ అరుదైన 3 రికార్డులు నమోదు  విరాట్ కోహ్లీ
    ITR filing date: ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగించిన కేంద్రం.. సెప్టెంబర్‌ 15 వరకు అవకాశం  ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    Omar Abdullah: 'కశ్మీర్‌లో పర్యాటకాన్ని ఉగ్రవాదం ఆపదు': పహల్గామ్‌లో ఒమర్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం అరుణాచల్ ప్రదేశ్
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025