NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తవాంగ్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా వేడుకలను జరుపుకోనున్న రక్షణ మంత్రి 
    తదుపరి వార్తా కథనం
    తవాంగ్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా వేడుకలను జరుపుకోనున్న రక్షణ మంత్రి 
    తవాంగ్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా వేడుకలను జరుపుకోనున్న రక్షణ మంత్రి

    తవాంగ్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా వేడుకలను జరుపుకోనున్న రక్షణ మంత్రి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 23, 2023
    10:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని ఫార్వర్డ్ బేస్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా జరుపుకోనున్నట్లు భద్రతా వర్గాల సమాచారం.

    రక్షణ మంత్రి కూడా తవాంగ్‌లో "శాస్త్ర పూజ"(ఆయుధాల పూజ)చేయబోతున్నారని వారు తెలిపారు.

    తూర్పు లడఖ్‌లోని కొన్ని ఫ్రిక్షన్ పాయింట్‌లలో భారతదేశం, చైనాలు తీవ్ర ప్రతిష్టంభనలో నిమగ్నమై ఉన్న సమయంలో,వాస్తవ నియంత్రణ రేఖకు (LAC) సమీపంలో ఉన్న వ్యూహాత్మక-ముఖ్యమైన ప్రదేశంలో సైనికులతో దసరా జరుపుకోవాలని సింగ్ నిర్ణయం తీసుకున్నారు.

    అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్‌లోని LAC వెంబడి గ్రౌండ్ పరిస్థితిని కూడా రక్షణ మంత్రి సమగ్రంగా సమీక్షిస్తారని ఆ వర్గాలు తెలిపాయి.

    రక్షణ మంత్రి ఈ ప్రాంతంలోని కొన్ని ఫార్వర్డ్ లొకేషన్‌లను కూడా సందర్శించే అవకాశం ఉంది.

    Details

    కొన్నేళ్లుగా దసరా రోజున "శాస్త్ర పూజ"

    రాజ్‌నాథ్ సింగ్ గత కొన్నేళ్లుగా దసరా రోజున "శాస్త్ర పూజ" చేస్తున్నారు. గతంలో బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా అయన ఇలానే అన్ని పండుగలను చేసుకున్నారు.

    విస్తృతమైన దౌత్య,సైనిక చర్చల తరువాత ఇరుపక్షాలు అనేక ప్రాంతాల నుండి విడదీయడం పూర్తి చేసినప్పటికీ, తూర్పు లడఖ్‌లోని కొన్ని ఫ్రిక్షన్ పాయింట్‌లలో భారతదేశం,చైనా దళాలు మూడేళ్ళకు పైగా ఘర్షణలో ఉన్నాయి.

    సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు మామూలుగా ఉండవని భారత్ చెబుతోంది.

    తూర్పు లడఖ్ ప్రతిష్టంభన తర్వాత సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్‌లతో సహా దాదాపు 3,500 కి.మీ-పొడవు LAC వెంట సైన్యం,ఆయుధాల మోహరింపును గణనీయంగా బలపరిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం అరుణాచల్ ప్రదేశ్
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025