NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: ఆపరేషన్ సిందూర్..ఉదయం 10గంటలకు ఆర్మీ ప్రెస్ బ్రీఫింగ్ 
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్..ఉదయం 10గంటలకు ఆర్మీ ప్రెస్ బ్రీఫింగ్ 
    ఆపరేషన్ సిందూర్..ఉదయం 10గంటలకు ఆర్మీ ప్రెస్ బ్రీఫింగ్

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్..ఉదయం 10గంటలకు ఆర్మీ ప్రెస్ బ్రీఫింగ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    08:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి భారత్ ఘాటుగా ప్రతిస్పందించింది.

    పాకిస్థాన్ భూభాగంలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం తీవ్రంగా దాడులు నిర్వహించింది.

    ఈ దాడులకు "ఆపరేషన్ సిందూర్‌" అని పేరు పెట్టారు.

    ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించామని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.

    ఈ మెరుపు దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను భారత ఆర్మీ కొద్దిసేపట్లో వెల్లడించనుంది.

    బుధవారం ఉదయం 10 గంటలకు దీనిపై ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించనుంది.

    వివరాలు 

    సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులు 

    ఇదే సమయంలో, ఈ ఆపరేషన్‌కు సంబంధించి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సంప్రదించారు.

    ఆపరేషన్ సిందూర్‌ అమలుపై వివరాలు తెలుసుకునేందుకు, ప్రస్తుత భద్రతా పరిస్థితులపై ఫీడ్‌బ్యాక్ పొందేందుకు ఆయన వీరితో మాట్లాడినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

    అటు, ఈ మెరుపు దాడుల ప్రభావంతో సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు దిగుతోంది.

    అయితే వాటిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది, ప్రతిదాడులకు సమర్థవంతంగా స్పందిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025