NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajnath Singh:మసూద్ అజార్‌కు పాకిస్తాన్ ₹14 కోట్లు పరిహారం.. IMF రుణం గురించి పునరాలోచించాలి': రాజ్ నాథ్ సింగ్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rajnath Singh:మసూద్ అజార్‌కు పాకిస్తాన్ ₹14 కోట్లు పరిహారం.. IMF రుణం గురించి పునరాలోచించాలి': రాజ్ నాథ్ సింగ్ 
    మసూద్ అజార్‌కు పాకిస్తాన్ ₹14 కోట్లు పరిహారం.. IMF రుణం గురించి పునరాలోచించాలి': రాజ్ నాథ్ సింగ్

    Rajnath Singh:మసూద్ అజార్‌కు పాకిస్తాన్ ₹14 కోట్లు పరిహారం.. IMF రుణం గురించి పునరాలోచించాలి': రాజ్ నాథ్ సింగ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 16, 2025
    04:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో పాకిస్థాన్‌ సంవత్సరాల తరబడి పెంచిపోషించిన ఉగ్రవాదాన్ని నాశనం చేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

    ప్రస్తుతం పాక్‌ చర్యలను భారత్‌ సున్నితంగా గమనిస్తోందని,అత్యంత స్వల్పమైన తప్పిదం జరిగినా తగిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

    గుజరాత్‌లోని భుజ్‌ వైమానిక స్థావరంలోని సైనికులతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

    అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి వచ్చిన సాయాన్ని పాకిస్తాన్‌ తమ దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మాణానికి వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు.

    అప్పు చేసి అయినా ఉగ్రవాద శిబిరాలను నిర్మించి వాటిని నడిపించడమే పాకిస్తాన్‌ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.

    వివరాలు 

    ఐఎంఎఫ్‌ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి 

    ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను పునర్నిర్మించేందుకు జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌కు రూ.14 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించిందని వెల్లడించారు.

    పాక్‌కు ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

    ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్‌ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని, భవిష్యత్తులో పాకిస్తాన్‌కు ఎలాంటి సహాయం చేయరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.

    ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాకిస్తాన్‌కు అర్థరాత్రి తెల్లవారుఝామున ఎలా ఉండాలో భారత సైన్యం చూపించిందని ఆయన అన్నారు.

    ఈ దాడిలో భారత సైనికుల ప్రదర్శించిన అసామాన్య ధైర్యం దేశంలోనే కాదు, విదేశాల్లోని భారతీయులను కూడా గర్వపడేలా చేసిందని తెలిపారు.

    వివరాలు 

    భుజ్‌ సైనికుల కృషిని కొనియాడిన రాజ్‌నాథ్‌

    ఈ ఆపరేషన్‌ అంతర్జాతీయంగా గొప్ప స్పందన పొందిందని చెప్పారు. భారత బ్రహ్మోస్‌ క్షిపణుల సామర్థ్యాన్ని దాయాది దేశం కూడా ఒప్పుకుందని వివరించారు.

    భుజ్‌ వైమానిక స్థావరం ఇప్పటికే పాకిస్తాన్‌ డ్రోన్లను కూల్చివేసిన దళమైనందున, భుజ్‌ సైనికుల కృషిని రాజ్‌నాథ్‌ కొనియాడారు.

    1965లో జరిగిన యుద్ధంలోనూ పాకిస్తాన్‌పై భారత విజయానికి ఈ స్థావరం సాక్షిగా నిలిచిందని గుర్తుచేశారు.

    ఇదిలా ఉంటే, భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పాకిస్తాన్‌కు IMF రూ.8,540 కోట్ల (1 బిలియన్‌ డాలర్లు) సాయం మంజూరు చేసింది.

    ఇది ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఆమోదించబడింది.

    వివరాలు 

    మసూద్‌ కుటుంబానికి మొత్తం రూ.14 కోట్లు

    ఇంకా, పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తాజాగా జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు పరిహారం ప్రకటించారు.

    భారత వైమానిక దాడుల్లో మసూద్‌ కుటుంబానికి చెందిన 14 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.

    దీంతో మసూద్‌ కుటుంబానికి మొత్తం రూ.14 కోట్లు ఇవ్వబోతున్నట్లు స్పష్టమవుతోంది.

    అంతేకాక, భారత దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను పునర్నిర్మిస్తామని కూడా పాకిస్తాన్‌ ప్రధాని హామీ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే! తెలంగాణ
    Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు
    UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం యూపీఐ
    DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025