
Rajnath Singh:మసూద్ అజార్కు పాకిస్తాన్ ₹14 కోట్లు పరిహారం.. IMF రుణం గురించి పునరాలోచించాలి': రాజ్ నాథ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో పాకిస్థాన్ సంవత్సరాల తరబడి పెంచిపోషించిన ఉగ్రవాదాన్ని నాశనం చేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం పాక్ చర్యలను భారత్ సున్నితంగా గమనిస్తోందని,అత్యంత స్వల్పమైన తప్పిదం జరిగినా తగిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గుజరాత్లోని భుజ్ వైమానిక స్థావరంలోని సైనికులతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి వచ్చిన సాయాన్ని పాకిస్తాన్ తమ దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మాణానికి వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు.
అప్పు చేసి అయినా ఉగ్రవాద శిబిరాలను నిర్మించి వాటిని నడిపించడమే పాకిస్తాన్ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.
వివరాలు
ఐఎంఎఫ్ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి
ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను పునర్నిర్మించేందుకు జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్కు రూ.14 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిందని వెల్లడించారు.
పాక్కు ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని రాజ్నాథ్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని, భవిష్యత్తులో పాకిస్తాన్కు ఎలాంటి సహాయం చేయరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్కు అర్థరాత్రి తెల్లవారుఝామున ఎలా ఉండాలో భారత సైన్యం చూపించిందని ఆయన అన్నారు.
ఈ దాడిలో భారత సైనికుల ప్రదర్శించిన అసామాన్య ధైర్యం దేశంలోనే కాదు, విదేశాల్లోని భారతీయులను కూడా గర్వపడేలా చేసిందని తెలిపారు.
వివరాలు
భుజ్ సైనికుల కృషిని కొనియాడిన రాజ్నాథ్
ఈ ఆపరేషన్ అంతర్జాతీయంగా గొప్ప స్పందన పొందిందని చెప్పారు. భారత బ్రహ్మోస్ క్షిపణుల సామర్థ్యాన్ని దాయాది దేశం కూడా ఒప్పుకుందని వివరించారు.
భుజ్ వైమానిక స్థావరం ఇప్పటికే పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేసిన దళమైనందున, భుజ్ సైనికుల కృషిని రాజ్నాథ్ కొనియాడారు.
1965లో జరిగిన యుద్ధంలోనూ పాకిస్తాన్పై భారత విజయానికి ఈ స్థావరం సాక్షిగా నిలిచిందని గుర్తుచేశారు.
ఇదిలా ఉంటే, భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్కు IMF రూ.8,540 కోట్ల (1 బిలియన్ డాలర్లు) సాయం మంజూరు చేసింది.
ఇది ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఆమోదించబడింది.
వివరాలు
మసూద్ కుటుంబానికి మొత్తం రూ.14 కోట్లు
ఇంకా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కు పరిహారం ప్రకటించారు.
భారత వైమానిక దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
దీంతో మసూద్ కుటుంబానికి మొత్తం రూ.14 కోట్లు ఇవ్వబోతున్నట్లు స్పష్టమవుతోంది.
అంతేకాక, భారత దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను పునర్నిర్మిస్తామని కూడా పాకిస్తాన్ ప్రధాని హామీ ఇచ్చారు.