NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajnath Singh: 'పీఓకే ప్రజలు భారతదేశంలో చేరాలి'..జమ్మూ కాశ్మీర్ ఎన్నిలక ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్
    తదుపరి వార్తా కథనం
    Rajnath Singh: 'పీఓకే ప్రజలు భారతదేశంలో చేరాలి'..జమ్మూ కాశ్మీర్ ఎన్నిలక ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్
    'పీఓకే ప్రజలు భారతదేశంలో చేరాలి

    Rajnath Singh: 'పీఓకే ప్రజలు భారతదేశంలో చేరాలి'..జమ్మూ కాశ్మీర్ ఎన్నిలక ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 08, 2024
    05:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

    జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ ఠాకూర్‌కి మద్దతుగా రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ప్రసంగించారు.

    పీఓకే ప్రజలు భారత్‌లో చేరాలని, వారిని విదేశీయుల్లా చూడకుండా సొంతవారిలా ఆదరిస్తామన్నారు.

    ఆర్టికల్ 370 గురించి నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి హామీ ఇచ్చిన విషయం ఆయన ప్రస్తావించారు.

    వివరాలు 

     ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడం అసాధ్యం 

    ఎన్సీ మేనిఫెస్టోలో ఆర్టికల్ 370ని తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ గురించి మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్, ఎన్సీ,కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

    బీజేపీ ఉన్నంతవరకు జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడం అసాధ్యమని చెప్పారు.

    ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తరువాత, 2014 ఎన్నికల తర్వాత తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.

    బీజేపీ, పీడీపీలు ఒంటరిగా పోటీలో నిలబడగా, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)-కాంగ్రెస్‌లు కలిసి కూటమిగా పోటీలో ఉన్నాయి.

    ఆర్టికల్ 370, 35-ఏ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన మార్పులని రాజ్‌నాథ్ స్వాగతించారు.

    గతంలో ఇక్కడ యువకులు పిస్టల్స్, రివాల్వర్లను కలిగి ఉండగా, ఇప్పుడు వారి చేతుల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉన్నాయని చెప్పారు.

    వివరాలు 

    90 సభ్యుల అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు

    జమ్మూ కాశ్మీర్‌లో 2014 తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి.

    90 సభ్యుల అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి: మొదటి దశ సెప్టెంబర్ 18న, రెండో దశ సెప్టెంబర్ 25, మూడో దశ అక్టోబర్ 01న. అక్టోబర్ 08న కౌంటింగ్ జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025