
India-China: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు పాయింట్ ఫార్ములా.. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్జున్ను కలిసి కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని సంక్లిష్టతలు తలెత్తకుండా ఉండేందుకు ఎలాంటి వ్యూహాలు అవలంబించాలో కూడా వారు సమీక్షించారు. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యల పరిష్కారానికి రాజ్నాథ్ సింగ్ నాలుగు ముఖ్యమైన అంశాల ప్రాతిపదికన ఒక ఫార్ములాను చైనా ప్రతినిధులకు సూచించినట్లు సమాచారం.
వివరాలు
అందులో భాగంగా:
సైనిక బలగాల ఉపసంహరణను కొనసాగించాలి, ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు తీసుకోవాలి, సరిహద్దుల గుర్తింపు, నిర్ధారణ అంశాలను పరిష్కరించాలి, రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను తొలగించి, పరస్పర సంబంధాలను బలోపేతం చేయాలి అనే అంశాలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ నాలుగు అంశాలు ప్రస్తుతం దేశీయ మీడియా కథనాల్లో ప్రముఖంగా వెలుగు చూసాయి. చైనాతో సంబంధాలను మెరుగుపర్చే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.