
Rajnath Singh: ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది: రాజ్నాథ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కొత్తగా తయారు చేసిన 'ఉదయగిరి (F35)','హిమగిరి (F34)'యుద్ధనౌకలను జాతికి అంకితం చేశారు. ఈ నౌకలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డిజైన్, స్టెల్త్, ఆయుధాలు,సెన్సార్ వ్యవస్థలతో రూపొందించారు. దేశంలోని వేర్వేరు షిప్యార్డ్లలో నిర్మించబడిన రెండు ఫ్రంట్లైన్ సర్ఫేస్ యుద్ధనౌకలను ఒకేసారి జాతికి అంకితం చేయడం ఇదే మొదటి సందర్భం. ఈ నౌకలు బ్లూ వాటర్ పరిస్థితుల్లో రక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
వివరాలు
2050 నాటికి దేశంలో 200 యుద్ధనౌకలు
ఈ రెండు నౌకలు బహుళ పాత్రలను నిర్వర్తిస్తాయని రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. "స్వదేశీ యుద్ధనౌక సామర్థ్యానికి ఇవి చిహ్నం. ఆత్మనిర్భర్ భారత్ కోసం ఈ నౌకలు ఆదర్శంగా ఉంటాయి. ఆధునిక సాంకేతికత ఈ నౌకల రూపకల్పనలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. 2050 నాటికి దేశంలో 200 యుద్ధనౌకలను నిర్మించుకునే లక్ష్యం మనకు ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన అనంతరం మాట్లాడుతున్న రాజ్నాథ్ సింగ్
VIDEO | Defence Minister Rajnath Singh (@rajnathsingh), at the commissioning ceremony of Indian Navy stealth frigates INS Udaygiri and INS Himigiri, says, “Our objective is not to showcase power. India has never believed in aggressive expansionism, and the world knows that we… pic.twitter.com/ceTowBTMwK
— Press Trust of India (@PTI_News) August 26, 2025