NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి కీలక ఆదేశాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి కీలక ఆదేశాలు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి కీలక ఆదేశాలు

    Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి కీలక ఆదేశాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 10, 2025
    08:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ పాకిస్థాన్ సైన్యం డ్రోన్ దాడులకు పాల్పడుతున్న క్రమంలో, భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

    నియంత్రణ రేఖ వద్ద పౌరులపై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ సైన్యం పట్ల కఠినంగా, శిక్షార్హంగా వ్యవహరించాలని ఆయన భారత సాయుధ దళాలను ఆదేశించినట్టు సమాచారం.

    పాకిస్తాన్ తగినబుద్ధి చెప్పాల్సిందేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో,శనివారం న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

    ఈ భద్రతా సమీక్ష సమావేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS),త్రివిధ దళాధిపతులు హాజరవుతారు.

    అంతకు ముందు, ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంక్షోభంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

    వివరాలు 

    రాజౌరీ ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలు

    ఈ సమావేశంలో రక్షణ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ సిబ్బంది చీఫ్, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    ఇక పాకిస్తాన్ వైపు నుంచి దాడులు కొనసాగుతున్నట్టు ఇటీవలి ఘటనలు తెలుపుతున్నాయి.

    పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

    దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం పలు చోట్ల గట్టి కౌంటర్ చర్యలు తీసుకుంది. శుక్రవారం రోజున జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని 20కు పైగా పట్టణాలపై పాకిస్తాన్ డ్రోన్‌లు దాడికి యత్నించాయి.

    అయితే, భారత సాయుధ దళాలు అప్రమత్తంగా ఉండటంతో వాటిని సమర్థంగా తిప్పికొట్టగలిగాయి.

    వివరాలు 

    పాకిస్తాన్ సైన్యానికి ధీటైన ప్రతిస్పందన: రక్షణ మంత్రి

    ప్రస్తుతం దేశ సైనిక వ్యవస్థ పూర్తిగా అప్రమత్తంగా పని చేస్తోంది. పౌరుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.

    సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు పాకిస్తాన్ సైన్యానికి ధీటైన ప్రతిస్పందన ఇవ్వాలని రక్షణ మంత్రి స్పష్టంగా ఆదేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి కీలక ఆదేశాలు రాజ్‌నాథ్ సింగ్
    Operation Sindoor: రాజౌరి దాడుల్లో ఏడీసీ మృతి, ఇద్దరికీ గాయాలు  ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: భారత్ దాడులతో కలకలం.. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత పాకిస్థాన్
    India Pakistan War: పాకిస్తాన్ ఫతే-1 మిస్సైల్‌ని కూల్చేసిన భారత్.. ఆపరేషన్‌ సిందూర్‌

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025