NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ భేటీలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు,అజిత్ దోవల్.. ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్
    తదుపరి వార్తా కథనం
    Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ భేటీలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు,అజిత్ దోవల్.. ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్
    రాజ్‌నాథ్ సింగ్ భేటీలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు,అజిత్ దోవల్..

    Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ భేటీలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు,అజిత్ దోవల్.. ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    10:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంపై పాకిస్థాన్ మరోసారి తీవ్ర దుస్సాహసానికి పాల్పడింది. పాక్ భూభాగం నుంచి భారీ స్థాయిలో దాడులు జరిగాయని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం వెలుగులోకి వచ్చింది.

    ఈ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. ఈ ఘటనపై కీలక వివరాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించారు.

    పాక్ దాడులపై తాజా పరిణామాలను ప్రధాని మోదీ దగ్గర నుంచి గమనిస్తూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి.

    దీనితోపాటు, ప్రధాని మోదీ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిపై చర్చించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి సూచనలు చేశారు.

    వివరాలు 

    సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్

    ఇదిలా ఉండగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యున్నత స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

    ఈ సమీక్షలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), త్రివిధ దళాధిపతులు,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.

    పాక్ దాడులకు భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

    ముఖ్యంగా జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

    అన్ని రాష్ట్రాల్లో అధికారులకు సెలవులను రద్దు చేశారు. ఏ అధికారిగానైనా జిల్లా హద్దులు దాటి వెళ్లరాదని, అందరూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

    అలాగే, భద్రతా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం అరుణాచల్ ప్రదేశ్
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025