Page Loader
Rajnath Singh: "సముద్రంలో ఎక్కడ దాక్కున్న.. వేటాడి పట్టుకుంటాం: రాజ్‌నాథ్ సింగ్ 
"సముద్రంలో ఎక్కడ దాక్కున్న.. వేటాడి పట్టుకుంటాం: రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh: "సముద్రంలో ఎక్కడ దాక్కున్న.. వేటాడి పట్టుకుంటాం: రాజ్‌నాథ్ సింగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2023
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూ మంగళూరు ఓడరేవుకు వస్తుండగా అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. వర్తక నౌకపై దాడి చేసిన వారిని "సముద్రంలో ఎక్కడ దాక్కున్న.. వేటాడి, పట్టుకుంటామని" రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సముద్రంలో భారత నావికాదళం నిఘా పెంచిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. సముద్రంలో జరిగిన దాడులను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోని నిఘాను పెంచింది. నౌకపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని రక్షణ మంత్రి తెలిపారు. భారతదేశ అభివృద్ధిని చూసి కొన్ని దేశాలు విస్తుపోతున్నాయని మంత్రి తెలిపారు.

Details 

నౌకలో 20 మంది భారతీయ,వియత్నామీస్ సిబ్బంది

సౌదీ అరేబియా నుండి ముడి చమురును తీసుకువెళుతున్న MV కెమ్ ప్లూటో అనే కార్గో నౌక, న్యూ మంగళూరు ఓడరేవుకు వెళుతున్నప్పుడు అరేబియా సముద్రంలో భారతదేశ పశ్చిమ తీరంలో డిసెంబర్‌ 23న డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలోని అల్ జుబైల్ పోర్ట్ నుంచి న్యూ మంగుళూరు ఓడరేవుకు ఇది ముడి చమురును తీసుకువెళుతోంది. భారత నౌకాదళం ప్రకారం, 20 మంది భారతీయ,వియత్నామీస్ సిబ్బంది వాణిజ్య నౌకలో ఉన్నారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ్ రక్షణలో కార్గో షిప్ సోమవారం ముంబై పోర్టుకు చేరుకుంది.