Andhra Pradesh Bhavan: దిల్లీలో రూ.105.5 కోట్లతో ఏపీ భవన్ నిర్మాణం.. ఎన్బీసీసీకి బాధ్యతలు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రూ.105.5 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించేందుకు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్బీసీసీ)తో ప్రభుత్వం అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 2.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్కుమార్, ఎన్బీసీసీ చీఫ్ జనరల్ మేనేజర్ అనిల్కుమార్ సంతకాలు చేశారు.
వివరాలు
అత్యాధునిక సౌకర్యాలు, సమకాలీన శిల్పకళ
భవనం నిర్మాణం పూర్తైన అనంతరం కనీసం ఐదేళ్లపాటు వార్షిక నిర్వహణ బాధ్యతలను కూడా ఎన్బీసీసీ లేదా దాని అనుబంధ సంస్థకు అప్పగించేలా ఇరుపక్షాలు త్వరలో మరో ప్రత్యేక ఒప్పందం చేసుకోనున్నాయి. ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ భవనాన్ని ఆధునిక నిర్మాణ శైలికి ప్రతీకగా తీర్చిదిద్దనున్నట్లు ఎన్బీసీసీ తన ఎక్స్ వేదిక ద్వారా వెల్లడించింది. అత్యాధునిక సౌకర్యాలు, సమకాలీన శిల్పకళను ప్రతిబింబించేలా ఈ భవనం రూపుదిద్దుకోనున్నట్లు పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజధాని దిల్లీలో ఆధునిక ఏపీ భవన్.. ఎన్బీసీసీతో ప్రభుత్వం ఒప్పందం
🏛️ New Andhra Bhavan Coming Up in New Delhi
— Andhra Nexus (@AndhraNexus) July 3, 2026
The Andhra Pradesh government has signed an MoU with NBCC (India) Limited for the planning, design, and construction of a new Andhra Bhavan in the national capital.
💰 Project Cost: ₹105.5 crore pic.twitter.com/YuR6jZNypP