Page Loader
LCA: యుద్ధవిమానాల తయారీలోకి ప్రైవేటు రంగం .. రక్షణ ప్యానెల్ అనుమతి ఇచ్చింది
యుద్ధవిమానాల తయారీలోకి ప్రైవేటు రంగం .. రక్షణ ప్యానెల్ అనుమతి ఇచ్చింది

LCA: యుద్ధవిమానాల తయారీలోకి ప్రైవేటు రంగం .. రక్షణ ప్యానెల్ అనుమతి ఇచ్చింది

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో యుద్ధ విమానాల తయారీలో ప్రైవేట్ రంగ ప్రవేశానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ సంబంధంగా డిఫెన్స్ ఎంపవర్‌మెంట్ కమిటీ తాజా సూచనలు చేసింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఉత్పత్తిని వేగవంతం చేయడం కోసం ఐదుగురు సభ్యుల కమిటీ ఇటీవల ఏర్పాటు చేయబడిన విషయం తెలిసిందే. ఈ కమిటీ తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కు నివేదికను సమర్పించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అధికార ప్రతినిధులు ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించిన వివరాల ప్రకారం,రక్షణ మంత్రి ఈ సూచనలను దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నారని తెలిపారు. గత కొన్ని నెలలుగా వాయుసేన చీఫ్ అమర్‌ ప్రీత్‌ సింగ్ భారత్‌లో తేజస్ ఉత్పత్తి, డెలివరీల్లో జాప్యం జరుగుతోందని బహిరంగంగా విమర్శిస్తున్నారు.

వివరాలు 

350 తేజస్ విమానాలను వినియోగించాలని లక్ష్యం

అలాగే, వాయుసేన ఆపరేషనల్ స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గిపోతుండటంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కమిటీకి రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్ అధ్యక్షత వహించారు. తాజా నివేదికలో తేజస్ ఉత్పత్తిలో ఎదురవుతున్న సమస్యలను స్వల్పకాల, మధ్యకాల, దీర్ఘకాలిక దృక్పథంతో అధిగమించేందుకు అవసరమైన చర్యలను సూచించింది. ముఖ్యంగా, ప్రైవేట్ రంగాన్ని భాగస్వామిగా చేర్చడం ద్వారా ఈ సమస్యల్ని అధిగమించవచ్చని పేర్కొంది. వాయుసేన వచ్చే 20 సంవత్సరాల్లో వివిధ వేరియంట్లలో దాదాపు 350 తేజస్ విమానాలను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అమెరికా నుండి ఇంజిన్ల రాకలో జాప్యం, మందకొడి ఉత్పత్తి వంటి సమస్యల కారణంగా ఈ ప్రణాళిక అమలులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది.