NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / LCA: యుద్ధవిమానాల తయారీలోకి ప్రైవేటు రంగం .. రక్షణ ప్యానెల్ అనుమతి ఇచ్చింది
    తదుపరి వార్తా కథనం
    LCA: యుద్ధవిమానాల తయారీలోకి ప్రైవేటు రంగం .. రక్షణ ప్యానెల్ అనుమతి ఇచ్చింది
    యుద్ధవిమానాల తయారీలోకి ప్రైవేటు రంగం .. రక్షణ ప్యానెల్ అనుమతి ఇచ్చింది

    LCA: యుద్ధవిమానాల తయారీలోకి ప్రైవేటు రంగం .. రక్షణ ప్యానెల్ అనుమతి ఇచ్చింది

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 04, 2025
    04:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో యుద్ధ విమానాల తయారీలో ప్రైవేట్ రంగ ప్రవేశానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడింది.

    ఈ సంబంధంగా డిఫెన్స్ ఎంపవర్‌మెంట్ కమిటీ తాజా సూచనలు చేసింది.

    తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఉత్పత్తిని వేగవంతం చేయడం కోసం ఐదుగురు సభ్యుల కమిటీ ఇటీవల ఏర్పాటు చేయబడిన విషయం తెలిసిందే.

    ఈ కమిటీ తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కు నివేదికను సమర్పించింది.

    ఈ వ్యవహారానికి సంబంధించిన అధికార ప్రతినిధులు ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించిన వివరాల ప్రకారం,రక్షణ మంత్రి ఈ సూచనలను దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నారని తెలిపారు.

    గత కొన్ని నెలలుగా వాయుసేన చీఫ్ అమర్‌ ప్రీత్‌ సింగ్ భారత్‌లో తేజస్ ఉత్పత్తి, డెలివరీల్లో జాప్యం జరుగుతోందని బహిరంగంగా విమర్శిస్తున్నారు.

    వివరాలు 

    350 తేజస్ విమానాలను వినియోగించాలని లక్ష్యం

    అలాగే, వాయుసేన ఆపరేషనల్ స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గిపోతుండటంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

    ఈ కమిటీకి రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్ అధ్యక్షత వహించారు.

    తాజా నివేదికలో తేజస్ ఉత్పత్తిలో ఎదురవుతున్న సమస్యలను స్వల్పకాల, మధ్యకాల, దీర్ఘకాలిక దృక్పథంతో అధిగమించేందుకు అవసరమైన చర్యలను సూచించింది.

    ముఖ్యంగా, ప్రైవేట్ రంగాన్ని భాగస్వామిగా చేర్చడం ద్వారా ఈ సమస్యల్ని అధిగమించవచ్చని పేర్కొంది.

    వాయుసేన వచ్చే 20 సంవత్సరాల్లో వివిధ వేరియంట్లలో దాదాపు 350 తేజస్ విమానాలను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    అయితే, అమెరికా నుండి ఇంజిన్ల రాకలో జాప్యం, మందకొడి ఉత్పత్తి వంటి సమస్యల కారణంగా ఈ ప్రణాళిక అమలులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025