NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajnath Singh:పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్నిఎదుర్కోవడానికి భారతదేశం అన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్   
    తదుపరి వార్తా కథనం
    Rajnath Singh:పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్నిఎదుర్కోవడానికి భారతదేశం అన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్   
    పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్నిఎదుర్కోవడానికి భారతదేశం అన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్

    Rajnath Singh:పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్నిఎదుర్కోవడానికి భారతదేశం అన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్   

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2025
    01:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు భారత దేశ తొలి స్వదేశీ యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు.

    ఈ సందర్బంగా ఆయన నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.

    ప్రస్తుత పరిస్థితులలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను,వారి దుష్ట ఉద్దేశాలను భారతదేశం తక్కువ సమయంలోనే సమూలంగా ధ్వంసం చేసిందని తెలిపారు.

    భారత దళాలు చాలా శక్తివంతంగా,స్పష్టతతో కూడిన దాడులు జరిపాయని,ఈ దాడులు పాకిస్థాన్ ను అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితికి నెట్టాయని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

    భారత సైనిక దళాలు నిర్వహించిన దాడులు వేగవంతంగా,తీవ్రతతో,అనూహ్యంగా జరిగాయని ఆయన కొనియాడారు.

    'ఆపరేషన్ సిందూర్' ద్వారా కేవలం ఉగ్రవాదులకే కాకుండా,వారిని సంరక్షించే, ప్రోత్సహించే శక్తులకు కూడా గట్టి హెచ్చరిక పంపినట్లు ఆయన స్పష్టం చేశారు.

    వివరాలు 

    ఉగ్రవాదంపై సమగ్ర దాడి

    ఈ ఆపరేషన్‌లో భారత నౌకాదళం కీలక భూమిక పోషించిందని మంత్రి వివరించారు.

    ఒకవైపు భారత వైమానిక దళం (IAF) పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తుండగా, మరోవైపు ఆరేబియా సముద్రంలో భారత యుద్ధనౌకలు పాకిస్థాన్ నౌకాదళాన్ని వారి తీర ప్రాంతానికే పరిమితం చేశాయని తెలిపారు.

    ఆపరేషన్ సిందూర్‌ను కేవలం సైనిక చర్యగా కాకుండా, ఉగ్రవాదంపై సమగ్ర దాడిగా చూడాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.

    పాక్‌లో ఉగ్రవాద శక్తులను కూల్చివేయడం కోసం అవసరమైన ఏ విధానాన్నైనా భారతదేశం అమలు చేస్తుందని, అవి పాకిస్తాన్ ఊహించలేని స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు.

    ఆఖరగా, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్ ఆడుతున్న ప్రమాదకరమైన ఉగ్రవాద ఆట ఇప్పుడు ముగిసిందని స్పష్టంగా తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    Rajnath Singh:పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్నిఎదుర్కోవడానికి భారతదేశం అన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్    రాజ్‌నాథ్ సింగ్
    Sadhana Broadcast shares fraud: సాధన బ్రాడ్‌కాస్ట్ షేర్ స్కామ్‌.. బాలీవుడ్ నటుడు సహా 57 మందిపై సెబీ నిషేధం  సెబీ
    Shane Watson: 'ఈసారి ఐపీఎల్ కప్ ఆర్సీబీదే'.. షేన్ వాట్సన్ వ్యాఖ్యలు వైరల్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Odisha Engineer: కిటికీ నుంచి నోట్ల వర్షం.. ఒడిశా ప్రభుత్వ అధికారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు  ఒడిశా

    రాజ్‌నాథ్ సింగ్

    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  తాజా వార్తలు
    బిపర్‌జోయ్ తుపాను; గుజరాత్ లోని 9 నగరాలకు రాకపోకలు బంద్  తుపాను
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025